NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు
    రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు

    High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    04:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో హై అలర్ట్ ప్రకటించారు.

    సరిహద్దు జిల్లాలైన జైసల్మేర్, రాంఘడ్, బడ్‌మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్‌లలో బ్లాక్‌ అవుట్ అమలు చేశారు.

    శాంతి భద్రతల దృష్ట్యా సాయంత్రం 5 గంటల నుంచి ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని భారత సైన్యం ఆదేశాలు జారీ చేసింది.

    నిన్నటి తరహాలో ఇవాళ కూడా జైసల్మేర్ ప్రాంతంలో పాకిస్థాన్ నుంచి దాడుల అవకాశముందని ముందస్తు హెచ్చరికలు అందాయి.

    గురువారం రాత్రి 9 గంటల సమయంలో జైసల్మేర్‌లో సైరన్లు మోగిన వెంటనే నగరమంతా బ్లాక్‌ అవుట్ అమలయ్యింది.

    Details

    విద్యుత్ సరఫరా నిలిపివేత

    విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో నగరం పరిసరాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

    ఈ ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. పేలుళ్ల శబ్దాలు అర్థరాత్రివరకు వినిపించాయని వారు చెబుతున్నారు. పాకిస్థాన్ దాడులకు భారత ఆర్మీ ధీటుగా ప్రతిచర్య తెలిపింది.

    ఆకస్మిక పరిస్థితుల్లో సైన్యం సమర్థవంతంగా స్పందించిందని సమాచారం.

    ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష జేపీ నడ్డా
    High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు రాజస్థాన్
    Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్  పరీక్ష దిల్లీ
    Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక సోషల్ మీడియా

    రాజస్థాన్

    Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్  సోనియా గాంధీ
    Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే.. భారతదేశం
    Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ  కాంగ్రెస్
    Tejas aircraft crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్ విమానం తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025