NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?
    6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?

    Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత విమానయాన రంగంలో వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.

    ఈ బెదిరింపులు విమానయాన సంస్థలకు భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఏయిర్‌లైన్ సంస్థలు ఈ నకిలీ బెదిరింపుల కారణంగా కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నాయి.

    అధికారులు ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

    కొన్ని బెదిరింపులు లండన్, జర్మనీ నుండి వచ్చినట్లు సమాచారం. ఇందుకు కారణాలు ఏమిటో, భారత విమానాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

    వివరాలు 

    రూ.80 కోట్ల వరకు నష్టం..

    గత సోమవారం నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా డొమెస్టిక్,ఇంటర్నేషనల్ విమానాలకు వరుసగా బెదిరింపులు వచ్చాయి.

    ముఖ్యంగా,ముంబై నుండి న్యూయార్క్ వెళ్లుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించాల్సి వచ్చింది.

    ఈ సంఘటనలో ఆ సంస్థకు సుమారు రూ.3 కోట్ల నష్టం జరిగింది.ఇప్పటి వరకు మొత్తం రూ.80 కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనా.

    బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో 130 టన్నుల ఇంధనంతో బయలుదేరింది.

    టేకాఫ్ అయిన వెంటనే బెదిరింపు రావడంతో రెండు గంటల లోపే ఢిల్లీలో ల్యాండ్ అయింది.

    ఈ సమయానికి సురక్షితంగా ల్యాండ్ కావడం కోసం 100 టన్నుల ఇంధనం వృథా చేయాల్సి వచ్చింది.దీనివల్ల రూ.1 కోటి నష్టం వచ్చింది.

    వివరాలు 

    భారత విమానయాన సంస్థలను లక్ష్యంగా బెదిరింపులు

    ఇంకా, ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి, ఈ సంఘటనలో కెనడాలోని ఇకాలూయిట్ అనే మారుమూల విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

    ఈ కారణంగా 200 మంది ప్రయాణికులతో ప్రయాణం ముగించడానికి మూడు రోజుల పాటు సమయం పట్టింది. దీనివల్ల రూ. 15-20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

    ఇంధన వ్యయం మాత్రమే కాకుండా, అనుకోని ల్యాండింగ్ ఛార్జీలు, ప్రయాణికుల వసతి, సిబ్బందిని మార్చడం వంటి ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చవుతోంది.

    ఈ బెదిరింపులు కావాలనే భారత విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనిపిస్తోంది.

    వివరాలు 

    విదేశీ విమానయాన సంస్థలు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొనలేదు

    ఈ చర్యలు ప్రయాణికుల్లో భయాందోళన పెంచడమే కాకుండా, అధికారులపై పనిఒత్తిడి పెంచుతున్నాయి.

    మరొవైపు, విదేశీ విమానయాన సంస్థలు ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొనలేదు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి దేశీయ సంస్థలనే టార్గెట్ చేయడం గమనార్హం.

    దేశీయ విమానాలు కూడా ఈ బెదిరింపుల బాధను అనుభవించాయి. రూట్‌లు మార్చడం వల్ల సంస్థలకు గంటకు రూ. 13 లక్షల నుండి 17 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది.

    అంతర్జాతీయ విమానాలలో ఈ నష్టం 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ పరిణామాల వలన మొత్తం రూ. 12 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

    ల్యాండింగ్, సిబ్బంది, ఇంధనం, కనెక్టింగ్ ఫ్లైట్ల ఖర్చులు కలిపి ఈ నష్టం రూ. 80 కోట్లకు చేరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం
    బాంబు బెదిరింపు

    తాజా

    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!  శ్రీలంక
    World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా  పాకిస్థాన్
    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌

    విమానం

    Flight : వీసా,పాస్‌పోర్ట్, టిక్కెట్ లేకుండానే విమానయానం.. అమెరికాలో అడుగుపెట్టిన రష్యన్ రష్యా
    Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం  అర్జెంటీనా
    Italy : ఈ జంట మృత్యుంజయులు.. ఒకే రోజు, ఇద్దరికీ వేర్వేరు విమాన ప్రమాదాలు ఇటలీ
    303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్‌ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి  నికరాగ్వా

    బాంబు బెదిరింపు

    Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు  భారతదేశం
    Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత  భారతదేశం
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బెంగళూరు
    Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..   తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025