NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Branded liquor: అందుబాటులో బ్రాండెడ్ మద్యం.. ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు
    తదుపరి వార్తా కథనం
    Branded liquor: అందుబాటులో బ్రాండెడ్ మద్యం.. ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు
    ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు

    Branded liquor: అందుబాటులో బ్రాండెడ్ మద్యం.. ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు

    వ్రాసిన వారు Stalin
    Jun 10, 2024
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోనే ప్రముఖ బ్రాండ్ అయిన కింగ్‌ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచారు .

    ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

    చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మద్యం పాలసీపై సమీక్షించే అవకాశం ఉంది.

    వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రభుత్వం తన మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది.

    బ్రాండెడ్ మద్యాన్ని నిలిపివేసి స్థానికంగా గుర్తింపు లేని మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా విక్రయించారు. దీనితో ప్రజల ఆరోగ్యాలు పాడయ్యాయని టీడీపీ ఆరోపించింది.

    వైసీపీ 

    వైసిపి పెద్దలపై తీవ్ర ఆరోపణలు 

    వైసిపి పాలనలో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని,ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు మద్యం మాఫియాగా మారారని ఆరోపించారు.

    ఏపీలో ఎన్డీయే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత,మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

    ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి కార్యాలయ ఆవరణలో సీఐడీ సోదాలు నిర్వహించింది.

    ఈ నెల 6న వాసుదేవరెడ్డి ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి కారులో ఫైళ్లు,కంప్యూటర్‌ పరికరాలు,ఇతర పత్రాలు తరలించారు.

    దీనిపై కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది.

    సీఐడీ..సెక్షన్‌ 427 కింద కేసు నమోదు చేసింది.379 ఇండియన్ పీనల్ కోడ్ 120-B(నేరపూరిత కుట్ర)కింద కేసులు నమోదు చేశారు .

    సోదాలు 

    ఎండీ ఇంట్లో సోదాలు 

    శుక్రవారం ఉదయం విజయవాడలోని సీఐడీ బృందాలు హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు నిర్వహించాయి.

    వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు, వారి సన్నిహితులు మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలపై గుత్తాధిపత్యం వహించి పెద్ద ఎత్తున దోచుకున్నారని ఆరోపించారు.

    రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో దోపిడి, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసేందుకు వాసుదేవ రెడ్డి ప్రయత్నించినట్లు సీఐడీ గుర్తించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    YSRCP: 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడదుల  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలు
    PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025