NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Government Hospitals: సర్కారు వైద్యానికి మెరుగులు.. కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Government Hospitals: సర్కారు వైద్యానికి మెరుగులు.. కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు 
    సర్కారు వైద్యానికి మెరుగులు.. కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు

    Government Hospitals: సర్కారు వైద్యానికి మెరుగులు.. కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 14, 2025
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో లోపాలను తొలగించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణను రూపొందిస్తోంది.

    ఈ ప్రణాళికలో భాగంగా ఆసుపత్రులకు ఆకర్షణీయతను కలిపి, బ్రాండింగ్‌ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముసాయిదాను సిద్ధం చేస్తోంది.

    ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం కొరవడింది. రోగుల బంధువులు ఏదైనా సమాచారాన్ని కోరినా సమగ్ర సమాధానం అందించే వ్యవస్థ లేకపోవడం వల్ల, చాలా మంది ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులవైపు మొగ్గుచూపుతున్నారు.

    ఈ విధమైన నమ్మకాన్ని తిరిగి చేకూర్చేందుకు, ప్రభుత్వ వైద్యసేవలను నూతనంగా మలచేందుకు ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది.

    వివరాలు 

    బ్రాండింగ్‌తో ఆసుపత్రులకు కొత్త రూపం 

    తొలుత, ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ హాస్పిటల్స్ తరహాలో ఆకర్షణీయంగా మలచేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

    ఆసుపత్రి భవనాలకు నూతన రంగులు వేయడమేకాకుండా, అందంగా అలంకరిస్తారు.

    లోపలికి వెళ్లగానే రిసెప్షన్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తారు. రోగులు లేదా వారి బంధువులు కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్, రిసెప్షనిస్టులు ప్రత్యేక యూనిఫాం ధరించి అందుబాటులో ఉంటారు.

    రాత్రి సమయాల్లో ఆసుపత్రులు దూరం నుంచే కనిపించేలా లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

    పిల్లల వార్డుల్లో గోడలపై ఆకర్షణీయమైన బొమ్మలు,ఆట వస్తువులు వుండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

    ఈ బ్రాండింగ్‌ అంశంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

    వివరాలు 

    దీర్ఘకాలిక వ్యాధులపై ప్రత్యేక దృష్టి 

    కొత్త వసతులతోపాటు, ప్రస్తుతం ఉన్న వసతులను మెరుగుపరిచే విధంగా ఈ పాలసీని రూపొందిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.

    ఉస్మానియా ఆసుపత్రిని ఆధునిక హంగులతో తీర్చిదిద్దడమేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్న నేపథ్యంలో మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కొత్త రూపంలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు.

    రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు.

    ఈ సమస్యను తీరుస్తూ ముసాయిదాలో ప్రత్యేక పథకాలను చేర్చనున్నారు.

    అసాంక్రమిక వ్యాధుల నియంత్రణకు ఇప్పటికే ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    ప్రత్యేకంగా 'క్యాన్సర్‌ కేర్‌' సెంటర్లు

    ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా, క్యాన్సర్‌ నివారణ కోసం ప్రత్యేకంగా 'క్యాన్సర్‌ కేర్‌' సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

    అత్యవసర పరిస్థితుల కోసం ట్రామా కేర్, పాలియేటివ్ కేర్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.

    సగటు జీవితస్పాన్ పెరుగుతున్న కారణంగా ఆసుపత్రులకు వచ్చే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.

    ఈ నేపధ్యంలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్‌ మెడిసిన్‌కు నూతన విధానంలో ప్రాధాన్యం కల్పించనున్నారు.

    వివరాలు 

    ఆధునిక సాంకేతికతతో వేగవంతమైన సేవలు 

    ప్రతి విభాగంలో సేవలను మరింత వేగవంతం చేయడానికి కృత్రిమ మేధ (AI) ఆధారిత సాంకేతికతను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రారంభించింది.

    దీనికోసం ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరిపారు. అంతేకాకుండా, ప్రపంచ బ్యాంకు నుండి రూ.4,150 కోట్ల రుణం మంజూరయ్యే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి.

    ఈ నిధులను ఉపయోగించి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    తెలంగాణ

    TGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే భారతదేశం
    FINE RICE DISTRIBUTION: నేటి నుండి రేషన్​ దుకాణాల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ  భారతదేశం
    Heavy Rains: ఈ జిల్లాల్లో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక! భారీ వర్షాలు
    Telangana: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. పేదలకు నిత్యావరస సరుకుల కిట్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025