NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు
    భారతదేశం

    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు

    వ్రాసిన వారు Naveen Stalin
    March 17, 2023 | 04:13 pm 0 నిమి చదవండి
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడిగించిన కోర్టు
    సిసోడియాను మరో ఏడురోజుల రిమాండ్ కోరిన ఈడీ

    మద్యం పాలసీ కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈడీ కస్టడీని మరో 5రోజులు పొడిగిస్తున్నట్లు రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. సిసోడియా ఏడు రోజుల ఈడీ రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో రూస్ అవెన్యూ కోర్టులో సిసోడియాను ఈడీ హాజరుపర్చింది. సిసోడియా ఫోన్లు ఎందుకు మార్చారనే తమ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. మనీష్ సిసోడియాను మరో ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. తన ఫోన్ ఎక్కడ ఉందో సిసోడియా చెప్పలేకపోయారని, తమ రిమాండ్‌లో సీబీఐ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిందని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగించాలన్న విజ్ఞప్తిని సిసోడియా తరపు న్యాయవాది వ్యతిరేకించారు.

    అప్పుడు సీబీఐ చేసిందే, ఇప్పుడు ఈడీ చేస్తోంది: సిసోడియా తరఫు న్యాయవాది

    సిసోడియా కంప్యూటర్‌ను గతంలో ఒక ఏజెన్సీ(సీబీఐ) స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేసిందని సిసోడియా తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పుడు మరో ఏజెన్సీ(ఈడీ) మొత్తం ప్రక్రియను మళ్లీ పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. నేర జరిగిన విషయాన్నే కాకుండా, దాని వల్ల వచ్చిన ఆదాయాన్ని కూడా చూపించాల్సిన బాధ్యత ఈడీపై ఉందని న్యాయవాది కోర్టు విన్నవించారు. సీబీఐ ఏడు నెలలు విచారణ చేసి, సిసోడియా రిమాండ్‌ను పొడిగించాలని అడిగితే కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది గుర్తు చేశారు. ఇప్పుడు ఈడీ కూడా అలాగే వ్యవహరిస్తోందని చెప్పారు. సీబీఐకి ప్రతినిధిగా ఈడీ వ్యవహరిస్తోందని న్యాయవాది వాదించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మనీష్ సిసోడియా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    దిల్లీ

    మనీష్ సిసోడియా

    జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు సీబీఐ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ దిల్లీ
    మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా దిల్లీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్
    కవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ కల్వకుంట్ల కవిత
    చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ కల్వకుంట్ల కవిత
    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ కల్వకుంట్ల కవిత

    దిల్లీ

    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కల్వకుంట్ల కవిత
    దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ రైల్వే శాఖ మంత్రి
    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ గోవా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023