గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 10 మందికి గాయాలు
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం అహ్మదాబాద్లోని ఇస్కాన్ వంతెనపై మారణహోమం జరిగింది.అతివేగంతో వచ్చిన జాగ్వార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా 9 మంది మరణించారు. నియంత్రణ లేని వేగంతో వస్తున్న కారు, గుమికూడి ఉన్న జనంపైకి దూసుకెళ్లింది.ప్రమాదంలో మరో 10 మంది గాయాలపాలయ్యారు. జాగ్వార్ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడంతోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. థార్, డంపర్ మధ్య అంతకు ముందే అక్కడో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.ఈ క్రమంలోనే ఘటనా స్థలిలో జనం గుమిగూడగా వేగంగా వచ్చిన జాగ్వార్ ఘటనా స్థలంలోకి దూసుకెళ్లి 9 మందిని పొట్టనబెట్టుకుంది.