Page Loader
Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ 
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ

Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత పది సంవత్సరాలలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని తెలిపారు. "వికసిత్ భారత్ సాధనమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు కేవలం 'గరీబీ హఠావో' అనే నినాదాలకే పరిమితం అయ్యాయి. కొంతమంది నాయకులు పెద్ద భవనాలు నిర్మించుకోవడంపైనే, పేదలతో ఫోటోలు దిగడంపైనే ఆసక్తి కనబరిచారు. కానీ, మేమైతే ప్రతి ఇంటికీ తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. దేశంలో పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాం" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

వివరాలు 

దిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, అది పూర్తిగా గ్రామానికి చేరుతోంది

కొంత మంది నేతలు పేదల గుడిసెల దగ్గరికి వెళ్లి వారితో ఫోటోలు తీసుకునేందుకు మాత్రమే ఉత్సాహం చూపిస్తారు. కానీ, సభల్లో పేదల గురించి మాట్లాడాల్సి వస్తే, ఫోటోలకు పోజులిచ్చిన వారు మొహం విసుగ్గా పెడతారు. గతంలో ఓ ప్రధానమంత్రి, "దిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే గ్రామాలకు కేవలం 16 పైసలే చేరుతున్నాయి" అని వాపోయారు. ఆ సమయంలో దిల్లీ నుంచి గ్రామస్థాయికి ఒకే ప్రభుత్వమే ఉన్నప్పటికీ పరిస్థితి మారలేదు. అయితే, ఇప్పుడు దిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, అది పూర్తిగా గ్రామానికి చేరుతోంది. నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే సొమ్ము జమ అవుతోంది'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.