NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం..

    Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. ఏడుగురు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    03:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది.

    ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    ఆరు అంతస్తుల ఈ భవనం పూర్తిగా నేలమట్టమైంది. ప్రాథమికంగా, నిర్మాణ నాణ్యత లోపమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

    ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కూలీలు మృతి చెందినట్టు సమాచారం.

    ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని ఇళ్లలో ఉన్నవారు ప్రాణ భయంతో పరుగులు తీశారు.

    ఏమి జరుగుతుందో తెలియక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు.

    వివరాలు 

    మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు

    ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.

    భవనం కూలిన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

    భవనం యజమాని శ్రీపతి శ్రీనివాసరావు పరారైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు మేరకు, భవన నిర్మాణం నాసిరకంగా చేపట్టారని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

    వివరాలు 

    సామాజిక కార్యకర్తలను బెదిరించిన ఇంటి యజమాని

    ఐటిడిఏ పిఓ రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయాలని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

    ఇంటి యజమాని సామాజిక కార్యకర్తలను బెదిరించినట్లు సమాచారం.

    పట్టణంలో అనేక భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం అవుతున్నాయని, ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఈ విషాదానికి పంచాయతీ శాఖ పూర్తి బాధ్యత వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భద్రాద్రి కొత్తగూడెం

    తాజా

    Father's Day 2025: ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకి 'హీరో'లా ఇలా స్పేషల్ గిఫ్ట్ ఇవ్వండి! ప్రేరణ
    UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం  యూపీఐ
    Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరిసిన మంధాన.. రెండో స్థానంలో భారత స్టార్ బ్యాటర్ ఐసీసీ
    Motivation: 'రిజెక్షన్' బాధ పెడుతోందా? మీలో ధైర్యాన్ని నింపే ఐదు మార్గాలివే! ప్రేరణ

    భద్రాద్రి కొత్తగూడెం

    Telangana : గుండెపోటుతో తండ్రి మృతి.. అంత్యక్రియలు చేసిన కూతుళ్లు! తెలంగాణ
    Uke Abbayya: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత తెలంగాణ
    Puligundala forest: పులిగుండాల అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి జాతులు.. లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025