NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / E - office: నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ 
    తదుపరి వార్తా కథనం
    E - office: నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ 
    నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ

    E - office: నెలాఖరుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 12, 2025
    08:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ నెలాఖరుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలియజేశారు.

    ప్రస్తుతం, ఒక ప్రభుత్వ విభాగాధిపతి కార్యాలయం, 58 స్వయం ప్రతిపత్తిగల (అటానమస్‌) విభాగాలు, ఐదు రాష్ట్ర యూనిట్లు కలిపి మొత్తం 64 కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

    మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న చంద్రబాబు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న దస్త్రాల సంఖ్య, ఒక్కో దస్త్రం క్లియర్ చేయడానికి తీసుకునే సమయం వంటి అంశాలను సమీక్షించారు.

    పెండింగ్ సమస్యను తగ్గించి, దస్త్రాల్ని వేగంగా పరిష్కరించేలా మంత్రులు, కార్యదర్శులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

    వివరాలు 

    పెండింగ్‌లో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలో అత్యల్పంగా 149 దస్త్రాలు

    ఆర్థిక సంబంధం లేని దస్త్రాలను అత్యవసర పరిస్థితులు ఐతే తప్ప వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

    ఆర్థిక అంశాలతో ముడిపడిన దస్త్రాల విషయంలో, బడ్జెట్ అందుబాటును పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యక్రమంలో పరిష్కరించాలని పేర్కొన్నారు.

    ఈ సమీక్ష సమావేశంలో, ఆర్టీజీఎస్ కార్యదర్శి దినేష్ కుమార్ దస్త్రాల స్థితిగతులపై ప్రజంటేషన్ ఇచ్చారు.

    రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2024 జనవరి 1 వరకూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అత్యధికంగా 14,140 దస్త్రాలు పెండింగ్‌లో ఉన్నాయి.

    ఇక, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలో అత్యల్పంగా 149 దస్త్రాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    ఆంధ్రప్రదేశ్

    Supreme Court: సీఎం చంద్రబాబుపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం  చంద్రబాబు నాయుడు
    AP Tourism Investments: రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు  భారతదేశం
    CM Chandrababu: బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన.. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి  భారతదేశం
    Nara Lokesh: ప్రతి శనివారం 'నో బ్యాగ్‌ డే'.. విద్యార్థుల కోసం కొత్త కార్యక్రమం నారా లోకేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025