NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌'కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర
    తదుపరి వార్తా కథనం
    Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌'కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర
    ₹16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌'కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర

    Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌'కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    04:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర క్యాబినెట్‌ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించడానికి నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ (NCMM)కి ఆమోదం తెలిపింది.

    ఈ మిషన్‌ కోసం రూ.16,300 కోట్ల వ్యయాన్ని కేటాయించి అమలు చేయనున్నారు.

    మన దేశం, ఆఫ్‌షోర్‌ ప్రాంతాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో పంచుకున్నారు.

    వివరాలు 

    ఇథనాల్‌ ధరను లీటర్‌కు రూ.56.28 నుండి రూ.57.97కు పెంపు 

    ఈమిషన్‌ ముఖ్య ఉద్దేశ్యం అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, అలాగే ఈ రంగంలో దేశాన్ని స్వావలంబన వైపు నడిపించడమే.

    ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా అధిక ఖనిజ సంపత్తి ఉన్న దేశాలతో వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం ద్వారా దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి తోడ్పడతాయని వైష్ణవ్‌ తెలిపారు.

    అదనంగా,సి హెచ్‌వీ మొలాసిస్‌ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ ధరను లీటర్‌కు రూ.56.28 నుండి రూ.57.97కు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

    అయితే,బి హెవీ మొలాసిస్‌,చెరకు రసం/చక్కెర/చక్కెర సిరప్‌ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ ధరల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపారు.

    పెట్రోల్‌లో ఇథనాల్‌ను మిళితం చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025