NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎన్నికల వేళ కేబినెట్‌లో మార్పులు.. నడ్డాను వరుసగా కలుస్తున్న కేంద్రమంత్రులు
    తదుపరి వార్తా కథనం
    ఎన్నికల వేళ కేబినెట్‌లో మార్పులు.. నడ్డాను వరుసగా కలుస్తున్న కేంద్రమంత్రులు
    ఎన్నికల వేళ కేబినెట్‌లో మార్పులు.. నడ్డాను వరుసగా కలుస్తున్న కేంద్రమంత్రులు

    ఎన్నికల వేళ కేబినెట్‌లో మార్పులు.. నడ్డాను వరుసగా కలుస్తున్న కేంద్రమంత్రులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 06, 2023
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు కేంద్రమంత్రులు, రాష్ట్రాల పార్టీల అధ్యక్షులు బారులు తీరుతున్నారు.

    ఈ మేరకు మధ్యప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ పటేల్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నడ్డాను కలిశారు.

    మంగళవారం మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, ఎస్పీ సింగ్ బఘేల్, భూపేందర్ యాదవ్‌లు సైతం నడ్డాతో సమావేశమయ్యారు.

    మరో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవ్య నడ్డాను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కొత్తగా నియమితులైన పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ నడ్డాతో సమావేశమయ్యారు.

    దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం కూడా పలువురు కీలక నాయకులు పార్టీ చీఫ్ ను కలిశారు.

    details

    కొత్తవారికి కేంద్ర కేబినెట్ లో చోటు ఇచ్చే అవకాశం

    మరో 3 రోజుల్లో జోన్ల వారీగా బీజేపీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. నార్త్ క్లస్టర్‌లో భాగమైన ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల నేతలు జూలై 7న దిల్లీలో భేటీ కానున్నారు.

    జులై 6న గౌహతిలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల సమావేశం జరగనుంది. జులై 8న దక్షిణాదికి సంబంధించిన సమావేశం జరగనుంది.

    ఇటీవలే 4 రాష్ట్రాల్లో కొత్త పార్టీ అధ్యక్షులను అధిష్టానం నియమించింది. తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరి, పంజాబ్ సునీల్ జాఖర్, జార్ఖండ్ బాబూలాల్ మరాండీలను అధ్యక్షులుగా ప్రకటించారు.

    ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నారు. అనంతరం మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నట్లు సమాచారం.

    వచ్చే ఏడాదిలో లోక్‌సభ ఎన్నికల వేళ కొందరిని తప్పించి, కొత్తవారికి చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    జేపీ నడ్డా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీజేపీ

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ కాంగ్రెస్
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    బీజేపీ ఎంపీ సుజనా చైదరికి కేంద్రం ఝలక్.. మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు ఎంపీ

    జేపీ నడ్డా

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025