NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC tunnel collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌.. 
    తదుపరి వార్తా కథనం
    SLBC tunnel collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌.. 
    ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌..

    SLBC tunnel collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 06, 2025
    04:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలం ఎడమ గట్టు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 13 రోజులు గడిచినా, లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

    అధికార యంత్రాంగం,రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, ప్రగతి కనిపించడం లేదు.

    టన్నెల్ లోపల ఉన్న వారిని గుర్తించేందుకు కేరళ నుండి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌ను రప్పిస్తున్నట్లు విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు.

    ఈరోజు ఉదయం టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ఐఐటీ నిపుణులు,సింగరేణి సాంకేతిక నిపుణులు,సైనిక అధికారులు,ఎన్‌డి‌ఆర్‌ఎఫ్‌, ఇతర అధికారులు సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలపై దిశానిర్దేశం చేశారు.

    వివరాలు 

    టన్నెల్ లోపల పనిచేసే సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు 

    అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్‌, సింగరేణి, ఐఐటీ నిపుణులతో పాటు సైనిక అధికారులు టన్నెల్‌లోకి ప్రవేశించారు.

    ఒక చివర నుండి మట్టిని తీయడంతో పాటు ఎస్కలేటర్‌పై వేస్తూ, నీటిని మరో వైపుకు మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు.

    సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహాయాన్ని వినియోగించుకుని, బురదను బయటకు తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారుల సూచన వచ్చింది.

    మధ్యాహ్నం వరకు క్యాడవర్ డాగ్స్ టన్నెల్‌ వద్దకు చేరుకుంటాయని తెలిపారు.

    టన్నెల్ లోపల పనిచేసే సిబ్బందికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

    ఈ సమీక్షలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు, సింగరేణి ప్రతినిధులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    తెలంగాణ

    SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌.. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు  భారతదేశం
    ATLAS: 'అట్లాస్‌' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం! భారతదేశం
    Free Driving Classes: మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్‌ కేంద్రాలు ఏర్పాటు  భారతదేశం
    Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ  నిజామాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025