NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి 
    తెలంగాణ శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి

    Telangana: తెలంగాణ శాసనసభలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 27, 2025
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో కాగ్‌ నివేదికను సమర్పించారు.

    2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌ వివరాలను అందించారు.

    2023-24 బడ్జెట్‌ అంచనాను రూ.2,77,690 కోట్లుగా నిర్ణయించగా, ఖర్చు అయిన మొత్తం రూ.2,19,307 కోట్లు అని వెల్లడించారు.

    మొత్తం బడ్జెట్‌లో 79 శాతం ఖర్చయిందని తెలిపారు. జీఎస్డీపీకి సంబంధించి ఈ వ్యయం 15 శాతంగా ఉందని వివరించారు.

    అలాగే, ఆమోదించిన బడ్జెట్‌ కంటే 33 శాతం అదనపు ఖర్చు ఏర్పడిందని, అదనంగా రూ.1,11,477 కోట్లు వ్యయం చేసినట్లు తెలియజేశారు.

    వివరాలు 

    కాగ్‌ నివేదిక ప్రకారం ముఖ్యమైన అంశాలు: 

    వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ కింద రూ.10,156 కోట్లు తీసుకున్న ప్రభుత్వం.

    ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో రూ.35,425 కోట్లు తీసుకుని 145 రోజుల పాటు వినియోగించింది.

    2023-24లో వడ్డీల చెల్లింపులకు రూ.24,347 కోట్లు ఖర్చు చేసింది.

    ఉద్యోగుల వేతనాల కోసం రూ.26,981 కోట్లు వెచ్చించింది.

    రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో 61.83 శాతం పన్నుల ద్వారా సమకూరింది.

    2023-24లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్‌లు మొత్తం రూ.9,934 కోట్లు.

    మొత్తం రెవెన్యూ ఆదాయంలో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పింఛన్లకు వెచ్చించిన ప్రభుత్వం.

    రెవెన్యూ మిగులు రూ.779 కోట్లు.

    రెవెన్యూ లోటు రూ.49,977 కోట్లు, ఇది జీఎస్డీపీలో 3.33 శాతంగా ఉంది.

    వివరాలు 

    కాగ్‌ నివేదిక ప్రకారం ముఖ్యమైన అంశాలు: 

    2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర మొత్తం అప్పులు రూ.4,03,664 కోట్లు.

    ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీఎస్డీపీలో అప్పుల వాటా 27 శాతంగా ఉంది.

    2023-24 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారంటీలు రూ.2,20,607 కోట్లు.

    మూలధన వ్యయం కింద 2023-24లో మొత్తం రూ.43,918 కోట్లు ఖర్చు చేసింది.

    స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు రూ.76,773 కోట్లు నిధులు విడుదల చేసింది.

    గత ఏడాదితో పోల్చితే స్థానిక సంస్థలు, ఇతర విభాగాలకు ఇచ్చిన నిధుల్లో 11 శాతం పెరుగుదల కనిపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లు భట్టి విక్రమార్క

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మల్లు భట్టి విక్రమార్క

    Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed హైదరాబాద్
    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  తెలంగాణ
    Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు తెలంగాణ
    Telangana: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: భట్టి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025