NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం 
    తదుపరి వార్తా కథనం
    CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం 
    కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం

    CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2024
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి.

    ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన అధ్యయనం జరగలేదని, మహారాష్ట్రలో ముంపు సమస్యను ఆ ప్రాజెక్టు పరిష్కరించలేదని పేర్కొంది.

    అంతేకాకుండా,వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం,ప్రాణహిత అనే రెండు వేర్వేరు ప్రాజెక్టులుగా రీడిజైన్ చేసిందని, ఈ రీడిజైన్ అంచనా వ్యయం 35,000 కోట్ల నుండి 85,650 కోట్లకు గణనీయంగా పెరిగిందని అభిప్రాయపడింది.

    అయితే, ప్రాజెక్టుల వ్యయం 122 శాతం పెరిగినప్పటికీ, నిధుల కేటాయింపు మాత్రం 52 శాతం మాత్రమే పెరిగిందని కాగ్ పేర్కొంది.

    Details 

    అనేక రకాల అవకతవకలు 

    రీ-ఇంజనీరింగ్ తర్వాత కూడా ప్రాజెక్టులో అదనపు మార్పులు చేశారని,ఫలితంగా కాళేశ్వరం వ్యయం వడ్డీతో సహా 47,427 కోట్లకు పెరిగిందని నివేదిక హైలైట్ చేసింది.

    ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరుపయోగంగా మారాయని,ఫలితంగా రూ.767.78 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లిందని నివేదికలో కాగ్‌ వెల్లడించింది.

    ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చూపెట్టారని కాగ్ రిపోర్ట్ తెలిపింది.

    ప్రాజెక్టు కి సంభందించిన వార్షిక ఖర్చులు తక్కువ చూపారని,కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి అమ్మకం ద్వారా రూ.1019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారని,ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు సేకరించినట్టు కాగ్ రిపోర్టు పేర్కొంది.

    రూ.87 వేల కోట్లు సమకూర్చుకునేందుకు 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుందని,బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉందని కాగ్ రిపోర్ట్ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాళేశ్వరం ప్రాజెక్టు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాళేశ్వరం ప్రాజెక్టు

    Annaram Barrage: అన్నారం బ్యారేజీలో లీకేజీ.. భయాందోళనలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలు అన్నారం బ్యారేజీ
    Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట కేంద్ర ప్రభుత్వం
    Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం  ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన  మేడిగడ్డ బ్యారేజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025