ఘోర రోడ్డు ప్రమాదం; కారును ఢీకొట్టిన ట్రక్కు, 15 మంది మృతి
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-ఆగ్రా హైవేపై మంగళవారం కారును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో 15మంది మృతి చెందారు. మరో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు మధ్యప్రదేశ్ నుంచి ధులే వైపు వెళ్తోంది. ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ట్రక్కు మితిమీరిన వేగంతో వచ్చిన కారును ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ చేస్తే స్పష్టమవుతుంది. ట్రక్కు వేగంగా వచ్చి కారును ఢీకొన్న తర్వాత, పక్కన ఉన్న బస్టాప్లో వారిని కూడా వాహనం ఢీకొట్టింది. అందువల్లే మరణాలు, గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.