NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి
    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు

    దిల్లీలో స్కూటీని ఢీకొట్టి 350మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు, ఇద్దరు యువకులు మృతి

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2023
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన అంజలి తరహా ఘటన దేశ రాజదానిలో మరొకటి చోటుచేసుకుంది. స్కూటీ‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత వారిని 350 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

    ఈ ప్రమాదం దిల్లీలోని కేశవపురంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులు ఐదుగురు ఉన్నట్లు చెప్పిన పోలీసులు, వారిని అరెస్టు చేసిన పేర్కొన్నారు.

    హిట్ అండ్ రన్ కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దిల్లీలో అంజలీ ఘటన వెలుగులోకి వచ్చాక అలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇటీవల గుజరాత్ సూరత్‌లో దంపతులు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీకొట్టి, బైకర్‌ను దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది.

    దిల్లీ

    కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నారు: పోలీసులు

    19 నుంచి 21 సంవత్సరాల వయస్సు గల ఐదుగురు విద్యార్థులు వివాహ వేడుక నుంచి తిరిగి వస్తూ, శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు హోండా యాక్టివా స్కూటర్‌ను కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పారు.

    స్కూటీని కారు ఢీకొట్టగానే ఇద్దరిలో ఒక యువకుడు ఎగిరి కారు పైకప్పుపై పడిపోయాడని, మరొకరు కారు బ్యానెట్‌లో ఇరుక్కుపోయినట్లు పోలీసులు చెప్పారు. కారు బంబర్‌లో స్కూటీ ఇరుక్కున్నట్లు పేర్కొన్నారు.

    అలాగే ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు యువకులను కైలాశ్ భట్నాగర్, సుమిత్ ఖరీగా పోలీసులు గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025