NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kiren Rijiju: భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    Kiren Rijiju: భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి 
    భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి

    Kiren Rijiju: భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : కేంద్ర మంత్రి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 14, 2024
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభలో భారత రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

    దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

    ఫ్రాన్స్‌, స్పెయిన్, ఇండోనేషియా లాంటి దేశాల్లోని ముస్లిముల పరిస్థితితో పోలిస్తే, భారత ముస్లిములు చాలా మెరుగైన స్థితిలో ఉన్నారని కిరణ్ రిజిజు తెలిపారు.

    భారతదేశం తన మైనార్టీల హక్కులను రక్షించడంలో ముందు ఉందని, పొరుగు దేశాల నుంచి మైనార్టీలు ఆశ్రయం కోరుతున్న విషయం దీని నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

    మైనార్టీలకు భారత రాజ్యాంగం అందజేస్తున్న న్యాయ రక్షణ విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు.

    Details

    కాంగ్రెస్ పార్టీపై విమర్శలు

    ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాల్లో మైనార్టీలకు ఓటింగ్ హక్కులు కూడా లభించడంలేదని ఆయన అన్నారు.

    అయితే భారతదేశంలో మైనార్టీలు తమ హక్కులను కాపాడుకునేందుకు సంపూర్ణ రక్షణ పొందుతున్నారని తెలిపారు.

    దేశం గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కిరణ్ రిజిజు సూచించారు.

    ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

    ప్రజాస్వామ్య రంగంలో భారత్‌తో ఏ ఇతర దేశాన్ని కూడా పోల్చకూడదని స్పష్టం చేశారు.

    స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు మార్చలేకపోయిందని ఆయన ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    కేంద్రమంత్రి

    తాజా

    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప
    Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు! అమెరికా
    Airtel Fraud Detection: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా 'ఫ్రాడ్‌ డిటెక్షన్‌' ఫీచర్‌ అందుబాటులోకి! ఎయిర్ టెల్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    భారతదేశం

    MG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్ ఎలక్ట్రిక్ వాహనాలు
    Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల వివరాలు లీక్ టెక్నాలజీ
    West Asia Conflict: పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన.. ఇజ్రాయెల్
    SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం పాకిస్థాన్

    కేంద్రమంత్రి

    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025