NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా
    మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా

    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    08:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు మే 6న కేసు నమోదు చేశారు.

    చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని మంగళంపేట ప్రాంతంలో ఉన్న అటవీ భూమిలో అక్రమంగా ప్రవేశించి, ఆ భూభాగాన్ని ఆక్రమించడమే కాకుండా అక్కడి జీవవైవిధ్యానికి హాని కలిగించినట్టు ప్రాథమిక నేర నివేదికలో (PFR) స్పష్టం చేశారు.

    ఈ కేసులో నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ పేర్లు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయిలతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది.

    వివరాలు 

    27.98 ఎకరాల అటవీ భూమి ఆక్రమణ 

    కమిటీ చేసిన విచారణలో పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు తేలింది.

    ఇంకా, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ బోర్లను ఏర్పాటు చేశారని, ఈ ఆక్రమణల వల్ల సుమారుగా రూ. కోటి విలువ చేసే జీవవైవిధ్య నష్టం సంభవించిందని అధికారులు స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు హద్దురాళ్లను నాటిస్తున్నారు. ఈ ప్రక్రియ ఇంకొంతకాలంలో పూర్తి కానుంది.

    వివరాలు 

    అధికారులపై విచారణ

    ఇతర క్రిమినల్ అంశాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో పాకాల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఇక మరోవైపు, ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి.

    ఈ అక్రమాలను ప్రోత్సహించిన లేదా సహకరించిన అధికారులపై విచారణ జరుగుతోందని అవసరమైతే వారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    తాజా

    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న సొంత పార్టీ నేతలు కుప్పం
    Peddireddy: కాంగ్రెస్‌లో చేరిన షర్మిల మాకు ప్రత్యర్థే : మంత్రి పెద్దిరెడ్డి వైఎస్ షర్మిల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025