NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన 
    తదుపరి వార్తా కథనం
    Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన 
    కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన

    Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే జనాభా లెక్కలలో కులగణనను చేర్చాలని ప్రకటించింది.

    ఈ మేరకు బుధవారం కేంద్రం క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

    ఈ ప్రకటనలో ఆయన, జనాభా లెక్కలతో పాటు కుల గణనను కూడా చేర్చాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు.

    కొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం "కులగణన" నిర్వహించాయని,ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.

    లోక్‌సభ ఎన్నికల సమయం నుండి,కాంగ్రెస్ పార్టీ సహా ఇతర రాజకీయ కూటమి నేతలు కుల గణన నిర్వహించాలన్న డిమాండ్ చేస్తున్నారు.

    వివరాలు 

    రాజకీయ పార్టీలు కుల గణనను సమర్థించాయి: అశ్విని వైష్ణవ్  

    కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.

    ఈ నేపథ్యంలో,కాంగ్రెస్ పాలిత తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలు,అలాగే ఎన్డీయే పాలిత బీహార్ రాష్ట్రం కులగణన నిర్వహించాయి.

    జాతీయ జనాభా లెక్కలలో కుల గణనను చేర్చడంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ కుల గణనను వ్యతిరేకించేవి. 2010లో, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుల గణనపై చర్చ జరిపే అంశాన్ని స్వీకరించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఒక మంత్రివర్గ బృందం ఏర్పడింది. పలు రాజకీయ పార్టీలు కుల గణనను సమర్థించాయి" అని తెలిపారు.

    వివరాలు 

    చెక్కర ధరకు సంబంధించి కీలక ప్రకటన

    కేంద్ర మంత్రివర్గం,కొన్ని రాష్ట్రాలు కుల గణనను సరిగ్గా నిర్వహించాయని,అయితే మరికొన్ని రాష్ట్రాలు పారదర్శకత లేకుండా,కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వేలు నిర్వహించాయని ఆరోపించారు.

    ఈ విధమైన సర్వేల వల్ల సమాజంలో సందేహాలు నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు.

    మన సామాజిక నిర్మాణం రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉండాలని,అందుకే కుల గణనను జాతీయ జనాభా లెక్కలలో చేర్చామని కేంద్రమంత్రి వివరించారు.

    ఇంకా,కేంద్రమంత్రి చెక్కర ధరకు సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు. 2025-26 చక్కర సీజన్‌లో చెరకుకు క్వింటాల్‌కు రూ.355 కనీస ధరగా నిర్ణయించారని, ఇది బెంచ్‌మార్క్ ధరగా పరిగణించబడుతుందని తెలిపారు.

    అలాగే,షిల్లాంగ్ నుండి సిల్చార్ వరకు రూ.22,864 కోట్ల వ్యయంతో హై స్పీడ్ కారిడార్‌ హైవే నిర్మాణానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం ఇచ్చిందని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    అశ్విని వైష్ణవ్

    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్ సోషల్ మీడియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025