NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్
    తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

    Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    03:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

    సుమారు ఏడాదిన్నర పాటు చేసిన కృషికి ఫలితంగా గోదావరి జలాలను వినియోగించుకునేందుకు భారీ అవకాశాలు ఏర్పడినట్లు మంత్రి తెలిపారు.

    ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు గోదావరి నీటి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని గుర్తుచేశారు.

    తాజాగా సీతారాం సాగర్ ద్వారా 68 టీఎంసీల నీరు విడుదలయ్యే అవకాశముండటంతో, సుమారు 8 లక్షల ఎకరాల భూమికి సాగునీటి లాభం చేకూరనుంది.

    ఈ అనుమతులు తెలంగాణ జలవనరుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

    Details

    ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి నిధులు కోరాం

    గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ కూలిపోయిన నేపథ్యంలో, సీతమ్మసాగర్ బ్యారేజి నిర్మాణంపై కేంద్ర జలవనరుల శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది.

    అయితే అన్ని సాంకేతిక వివరాలు సమర్పించిన తరువాతే సీడబ్ల్యూసీ (CWC) అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు.

    పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో సంభవించబోయే ముంపును నివారించేందుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్ర నిధులను కోరినట్లు ఉత్తమ్ చెప్పారు.

    దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. కృష్ణా జలాల పంపకంలో గత ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేసిందని, న్యాయం కోసం ట్రిబ్యునల్స్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా వాదిస్తోందని మంత్రి ఉత్తమ్ వివరించారు.

    Details

    కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అవినీతి

    అంతరాష్ట్ర సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా పని చేస్తోందని స్పష్టం చేశారు.

    కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, నాణ్యత లోపాలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఎత్తిచూపారు. ''వాళ్లే కట్టారు.. వాళ్ల హయాంలోనే కూలిపోయింది'' అంటూ ధ్వజమెత్తారు.

    మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం వంటి ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు NDSA నివేదికలో బయటపడ్డాయని ప్రజలు గుర్తించాలన్నారు.

    లక్ష కోట్ల రూపాయల అవినీతిపై దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరిగిందని గుర్తుచేశారు.

    NDSA నివేదికలో వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రజలకు మేల్కొలుపు కావాలని పిలుపునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కాంగ్రెస్

    తాజా

    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్

    తెలంగాణ

    Liquor shops closed: రేపు మద్యం దుకాణాలు బంద్.. కారణమిదే? భారతదేశం
    Telangana: తెలంగాణలో మళ్లీ భూకంపం భయం..? రామగుండం పరిసరాల్లో హెచ్చరికలు! భూకంపం
    Rains: తెలంగాణలో వడగండ్ల వర్షాల హెచ్చరిక.. పది జిల్లాలకు పైగా ఎల్లో అలర్ట్! భారీ వర్షాలు
    Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ  భారతదేశం

    కాంగ్రెస్

    Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ  రేవంత్ రెడ్డి
    Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్‌-బీజేపీ కార్యకర్తల ఘర్షణ బీజేపీ
    Indiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    Indira Bhawan : ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025