NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!
    అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!

    Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త రైల్వే లైన్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు వంటి ప్రాజెక్టులతో ముందుకెళ్తోంది.

    తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త అందించింది. ఈ అవకాశం దాదాపు 14 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.

    ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వం 500 పడకల ఈఎస్‌ఐ సెకండరీ కేర్ ఆసుపత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.

    ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి విభజన తర్వాత తెలంగాణకు చేరుకున్నందున, ఈ ఆసుపత్రిని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

    Details

    సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం

    దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల ప్రకారం, వైద్య కళాశాల కోసం 25 ఎకరాలు, ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు అవసరం.

    ఈ భూములను ఏపీ ప్రభుత్వం కేటాయించనుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణ బాధ్యతను ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు అప్పగిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారమూ ఉండదు.

    రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తే, ఒప్పందం ప్రకారం 1/8వ వంతు వ్యయం భరించాల్సి ఉంటుంది.

    అమరావతిలో ఆసుపత్రి, వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి అనేక కారణాలున్నాయి..

    Details

    రాష్ట్రవ్యాప్తంగా 14,55,987 మంది ఈఎస్‌ఐ ఉద్యోగులు

    ఇప్పటికే అమరావతిని కలుపుతూ జాతీయ రహదారులు, రైలు మార్గాలు సాగిపోతున్నాయి.

    భవిష్యత్తులో ఐటీ కంపెనీలు, హోటళ్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఇవన్నీ అమరావతిలో రానున్న అవకాశాలుగా ఉంటాయి.

    ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,55,987 మంది ఈఎస్‌ఐ ఉద్యోగులున్నారు.

    వారిలో 4 లక్షల మందికి పైగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉంటారు. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    కేంద్ర ప్రభుత్వం

    Medicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం ఇండియా
    UPS: ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్..  ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఆమోదం  భారతదేశం
    Ethanol: చెరకు  నుంచి ఇథనాల్ ఉత్పత్తిపై ఉన్న నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం..  భారతదేశం
    LGBTQ+: LGBTQ సమాజానికి గుడ్ న్యూస్.. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉమ్మడి బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025