తదుపరి వార్తా కథనం

Amaravati: ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 07, 2025
01:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4,285 కోట్లు మంజూరు చేసింది.
ఈ నిధుల్లో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ల ద్వారా అందించే నిధుల నుంచి 25 శాతం భాగాన్ని కేటాయించారు.
అలాగే కేంద్రం తన వాటా రూ.750 కోట్లు కలిపి ఈ మొత్తాన్ని విడుదల చేసింది.
అమరావతిలో నిర్మాణ పనులు మొదలవుతున్న నేపథ్యంలో, ప్రారంభ దశలో అవసరమైన నిధుల కోసం సీఆర్డీయే 25 శాతం అడ్వాన్స్గా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.