NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా?
    ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా?

    Telangana: ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యాసంగి సీజన్‌ కొనుగోళ్లలో మే నెలే కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వచ్చిపడుతోంది.

    మొత్తం టార్గెట్‌లో సగానికి పైగా ధాన్యం మే నెల్లోనే రానుండటంతో పౌరసరఫరాల శాఖతో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సవాలుగా మారింది.

    ముఖ్యంగా కాంటా వేయడం, గన్నీ బస్తాల లభ్యత, మిల్లులకు తరలింపు వంటి చర్యల్లో జాప్యం తలెత్తుతోంది.

    సరిపడా హమాలీలు లేకపోవడం, వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాల్సి రావడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. దీనివల్ల సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఇటీవల రాస్తారోకోకి కూడా దారితీసింది.

    Details

    కేంద్రాల వద్దే ధాన్యపు రాశులు

    ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో నిల్వలతో పోటెత్తుతున్నాయి. స్థలాభావంతో రైతులు ధాన్యాన్ని రహదారులపై ఆరబెడుతున్నారు.

    మే 10 నాటికి 1.12 లక్షల టన్నుల ధాన్యం బస్తాల్లో ప్యాక్‌ అయి రైస్‌ మిల్లులకు పంపించేందుకు సిద్ధంగా ఉంది.

    అయితే, ట్రాన్స్‌పోర్ట్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరిపడా లారీలు లేవు. ఉన్నవాటిని మిల్లుల్లో అన్‌లోడింగ్ ఆలస్యం చేస్తోంది. దీంతో వాహనాలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోతున్నాయి.

    ఇంకా 3.72 లక్షల టన్నుల వడ్లను కాంటా వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను ముందుగా తరలిస్తే మాత్రమే కొత్తగా వచ్చిన ధాన్యాన్ని కాంటా వేయడం సాధ్యమవుతుంది. అంతవరకు రైతులు ఎదురు చూడక తప్పడం లేదు.

    Details

    ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు గణాంకాలు

    ప్రస్తుతం వరి కొనుగోళ్లు 39.37 లక్షల టన్నులు దాటాయి. మొత్తం 5,76,992 మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారు.

    ఇందులో 24.95 లక్షల టన్నులు దొడ్డు వరి కాగా, 14.42 లక్షల టన్నులు సన్నవరి. రైస్‌ మిల్లులకు ఇప్పటివరకు 37.92 లక్షల టన్నులు తరలించారు.

    మరో 1.12 లక్షల టన్నులు తరలించాల్సి ఉంది. 0.33 లక్షల టన్నులు ఇప్పటికే గోదాముల్లో నిల్వ చేశారు. మొత్తంగా చూస్తే, కొనుగోలు ప్రక్రియకు ధాన్యం తలకెక్కుతోందే తప్ప రైతులు తడబడే పరిస్థితి లేదు.

    దీనిని సకాలంలో ప్రాసెస్ చేయగలిగితే రైతుల ఇబ్బందులకు బ్రేక్ పడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Telangana: ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా? తెలంగాణ
    Telangana: ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం.. తెలంగాణ రైతుల్లో ఆందోళన తెలంగాణ
    Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం నాదెండ్ల మనోహర్‌
    Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ తెలంగాణ

    తెలంగాణ

    Bhu Bharathi: తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు - నిషేధిత భూముల సమాచారం తెలుసుకోవడమెలా? భారతదేశం
    Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై క్షుణ్నంగా ఫీల్డ్ వెరిఫికేషన్.. ప్రతి 200 ఇళ్లకు ప్రత్యేకాధికారి నియామకం భారతదేశం
    Heat Waves: తెలంగాణలో పెరుగుతుతున్న వడగాలులు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ ఇండియా
    Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌ రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025