NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Digital Tribal university: డిజిటల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు
    తదుపరి వార్తా కథనం
    Digital Tribal university: డిజిటల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు
    డిజిటల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

    Digital Tribal university: డిజిటల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 25, 2024
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గిరిజనుల సంస్కృతి,జీవన విధానం గురించి మరింత సమాచారం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.

    ఈ యూనివర్శిటీ ద్వారా గిరిజనుల జీవన శైలీ, సంస్కృతి, ఆచార వ్యవహారాలు వంటి విషయాలపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను రూపొందించడం జరుగుతోంది.

    వివిధ రాష్ట్రాల్లోని గిరిజనుల ఆచారాల వ్యవహారాలకు సంబంధించి 25 సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకువస్తారు.

    వచ్చే విద్యాసంవత్సరంలో డిజిటల్ విధానంలో ఈ కోర్సులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

    వివరాలు 

    నాలుగు సబ్జెక్టులపై ముసాయిదా సిద్ధం చేసిన తెలంగాణ 

    ఈ క్రమంలో గురువారం రాష్ట్రాలలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అధికారులు సమీక్ష నిర్వహించారు.

    వివిధ రాష్ట్రాలకు అప్పగించిన సబ్జెక్టుల తయారీ పురోగతిని వారు సమీక్షించారు.

    తెలంగాణ రాష్ట్ర అధికారులు ఇప్పటికే నాలుగు సబ్జెక్టులపై ముసాయిదా సిద్ధం చేశారు.

    వాటిలో ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన గుస్సాడి నృత్యం, తోటికీర్తి సంగీతం, ఢోలికోయా సంగీతం, నాయక్‌పోడ్ మాస్క్‌లు ఉన్నాయి.

    వివరాలు 

     ముసాయిదాపై సబ్జెక్టు నిపుణులు మార్పులు, చేర్పులు

    మరిన్ని రాష్ట్రాల నుంచి మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, ఆహారం, మెడిసిన్, జీవన విధానం, ఆదివాసీ విజ్ఞానం, నృత్యం, నాటికలు, గిరిజన ఆరాధ్య దైవాలు వంటి అంశాలపై కూడా ముసాయిదాలు రూపొందిస్తున్నాయి.

    ఈ కోర్సులు డిజిటల్ విధానంలో ఉండి, వాటిని నేర్చుకునేందుకు వీడియో, ఆడియో పాఠాలు, టెక్స్ట్ మెటీరియల్ అందించబడుతుంది.

    రాష్ట్రాలు సిద్ధం చేసిన 25 సబ్జెక్టుల ముసాయిదాపై దిల్లీలోని సబ్జెక్టు నిపుణులు మార్పులు, చేర్పులు సూచించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    కేంద్ర ప్రభుత్వం

    #NewsBytesExplainer: SC-ST రిజర్వేషన్లలో అమల్లో క్రీమీలేయర్ ను ప్రభుత్వం నిరాకరించడానికి కారణం ఏమిటి?  సుప్రీంకోర్టు
    PM-Surya Ghar: 'మోడల్ సోలార్ విలేజ్' కోసం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల భారతదేశం
    #Newsbytesexplainer: మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదా ఎందుకు తెస్తోంది.. ఏడాదిలో బిల్లు ఎందుకు పాస్ కాలేదు?  భారతదేశం
    7th Pay Commission DA Hike:  ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో డీఏ పెంపు.. ఎంతంటే? బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025