NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
    తదుపరి వార్తా కథనం
    అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
    ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 27, 2023
    12:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఆర్‌ 5 జోన్‌ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 47 వేలకుపైగా ఇళ్ల పట్టాదారులకు గృహాలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

    ఈ నేపథ్యంలో జులై 8న గృహ నిర్మాణాలను ప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు గత మే 26న అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది.

    సీఆర్డీఏ పరిధిలోని 50 వేల 793 మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది.

    గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలను అందించారు.

    మరోవైపు పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహరంపై రాజకీయ దుమారం రేగింది.

    DETAILS

    జులై 8న సదరు ఇళ్ల స్థలాల్లో నిర్మాణాల ప్రారంభోత్సవాలకు లైన్ క్లియర్

    సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరం ప్రాంతాల్లో 51,392 మందికి ఇళ్ల పట్టాలు అందాయి.

    స్థలానికి సంబంధించి వివాదాలు కోర్టుల్లో ఉన్నాయని, ఇళ్ల మంజూరుపై ఆలోచించాలని గతంలోనే విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కోరాయి.

    అయితే ఆయా లేఖలను పక్కన బెట్టిన కేంద్రం, తాజాగా సీఆర్‌డీఏ పరిధిలోని 47 వేలకుపైగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్రానికి సమాచారం పంపింది.

    మరో 3 వేల ఇళ్లు పెండింగ్ ఉన్నాయని, త్వరలోనే అవి కూడా మంజూరు అవుతాయని ఏపీ ప్రభుత్వం ధీమాగా ఉంది. కేంద్రం నిర్ణయంతో జులై 8న సదరు ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలను ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం
    ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు నోట్ .. ఈ ఏడాది సెలవుల జాబితా ఇదిగో ! విద్యా శాఖ మంత్రి
    పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఒక్కరోజు ముందే మంగళగిరిలో హోమం పవన్ కళ్యాణ్
    వైసీపీ కాపు నేతలతో ముద్రగడ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ వై.ఎస్.జగన్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం ఆంధ్రప్రదేశ్
    ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025