NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ
    11మంది పోలీసులను సస్పెండ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశం

    దిల్లీ ప్రమాదం: 11మంది పోలీసులను సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2023
    04:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని సుల్తాన్‌పురి కారు ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మంది పోలీసులను సస్పెండ్ చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది.

    20ఏళ్ల అంజలి సింగ్ తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా.. జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల సమయంలో కారు ఢీకొట్టింది.

    ఈ క్రమంలో అంజలి కాలు కారు చక్రంలో ఇరుక్కుపోయింది. ఆమెను కారు దాదాపు 13కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో అంజలి మరణించగా.. ఆమె స్నేహితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు 40గాయాలతో అంజలి మరణించినట్లు పోలీసులు తెలిపారు.

    దిల్లీ ప్రమాదం

    సకాలంలో స్పందించకపోవడవం వల్లే కంట్రోల్ రూమ్ సిబ్బందిపై వేటు

    అంజలిని కారు ఢీకొట్టి 13కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో.. ఆ రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్) విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను కూడా కేంద్ర హోం శాఖ బాధ్యులను చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11మందిపై వేటు వేసింది.

    సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 1 కానిస్టేబుల్ ఉన్నారు. వీరిలో ఐదుగురిని రోడ్డుపై పికెటింగ్‌లో ఉంచగా.. ఆరుగురిని పీసీఆర్‌ వ్యాన్‌లో విధులు నిర్వహించారు.

    మహిళ మరణంపై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించినా.. సకాలంలో వారు స్పందించలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో కేంద్ర హోం శాఖ చర్యలకు ఉపక్రమించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హోంశాఖ మంత్రి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం

    హోంశాఖ మంత్రి

    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025