NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు 
    తదుపరి వార్తా కథనం
    Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు 
    దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు

    Delhi Air Pollution: దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రం కఠిన చర్యలు.. జరిమానాల మొత్తాలు రెట్టింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 07, 2024
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది.

    రైతులు తమ పంట వ్యర్థాలను కాల్చితే గరిష్ఠంగా రూ.30 వేలు వరకు జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది.

    దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపర్చడం కోసం ఈ చర్య చేపట్టింది.

    తక్షణం అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, 2ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తే రూ.5వేలు జరిమానా చెల్లించాలి.

    అదే 2-5 ఎకరాల మధ్య భూమి కలిగినవారికి రూ.10 వేలు, 5ఎకరాలకన్నా ఎక్కువ భూమి కలిగినవారికి రూ.30 వేలు జరిమానా విధిస్తారు.

    ఈ నిబంధనలు'ది కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ చట్టం-2021' లో భాగంగా అమలులోకి వచ్చాయి.

    వివరాలు 

    ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 356

    గత నెల చివరలో దిల్లీలో కాలుష్యం అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సమయంలో కేంద్రం తీసుకున్న చర్యలను విమర్శించింది.

    పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని, అమలుకు అధికారులు నియమించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

    ఈ సందర్బంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి మాట్లాడుతూ, పర్యావరణ చట్టాల ప్రకారం జరిమానాలను కఠినంగా అమలు చేస్తామని న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.

    ఇటీవలి కాలంలో దిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత మించి తారాస్థాయికి చేరుకుంది.

    ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 356కు చేరింది. ఈ కారణంగా కేంద్రం జరిమానా మొత్తాలను పెంచే నిర్ణయం తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    దిల్లీ

    Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన అరవింద్ కేజ్రీవాల్
    Kejriwal Resignation: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అరవింద్ కేజ్రీవాల్
    Congress: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. బీజేపీ నేతలు, మిత్రపక్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025