SIMI: సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ప్రభుత్వం ఈ సంస్థను "చట్టవిరుద్ధమైన సంఘం"గా ముద్ర వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా X (గతంలో ట్విట్టర్)లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2001లో సిమిని తొలిసారిగా చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఐదేళ్లకోసారి నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.