Puja Khedkar : పూజా ఖేద్కర్ ఏకపక్ష ధోరణి.. ఏక వ్యక్తి కమిటీతో UPSC విచారణ
ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ నియామకం జరిగిన నాటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. ఈ ఆరోపణలు , వివాదంపై విచారణ జరిపి నివేదిక సమర్పించమని కేంద్రం ఏక సభ్య కమిషన్ ను నియమించింది. ఆయన తన నివేదికను త్వరలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కు సమర్పించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో పూజ ఖేద్కర్ దృష్టిలోపం , మానసిక అనారోగ్యం అని పేర్కొన్నారు. ఆమెకు తక్కువ పరీక్ష మార్కులు ఉన్నప్పటికీ, ఈ రాయితీల వల్ల ఆమె పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం సాధ్యమైంది
రాయితీల వల్ల 821ని సాధించింది
ఖేద్కర్ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 821ని సాధించింది. ఆమె ఎంపికైన తర్వాత,upsc ఆమె వైకల్యాలను ధృవీకరించడానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది. అయితే, ఖేద్కర్ ఆరు వేర్వేరు సందర్భాలలో ఈ పరీక్షలకు హాజరు కావడానికి నిరాకరించారు. ఏప్రిల్ 22, 2022 ఆగస్ట్ 26, 2022 మధ్య ఐదు షెడ్యూల్ చేసిన వైద్య పరీక్షలకు మిస్ అయిన తర్వాత. ఆమె సెప్టెంబర్ 2న ఆమె దృష్టిలోపాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించిన కీలకమైన MRI పరీక్షకు హాజరు కాలేదు. నిబంధనలకు భిన్నంగా ఖేద్కర్ బయటి పరీక్షా కేంద్రం నుండి తెచ్చిన MRI నివేదికను సమర్పించారు. దానిని UPSC తిరస్కరించింది.
ఆది నుంచి వివాదాలే
హుందాగా లేకుండా ప్రవర్తిస్తున్న ఆమె ఎంపికను UPSC సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో సవాలు చేసింది. ఈ వివాదంపై ఫిబ్రవరి 23, 2023న ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అయితే, ఆమె సమర్పించిన MRI సర్టిఫికేట్ తరువాత ఆమోదించారు.దీనితో ఆమె IAS అధికారిగా నియమితులయ్యారు. ఇదిలా వుంటే పూజా ఖేద్కర్ తన హోదా కోసం అనుమతించని కలెక్టర్ కార్యాలయం నుండి ప్రత్యేక అధికారాలను కోరారని ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆమెను అధికార దుర్వినియోగం ఆరోపణతో పూణే నుండి వాషిమ్కు బదిలీ చేశారు. ఈ వివాదంతో ఆమెకు జాతీయ స్ధాయిలో ప్రాచుర్యం వచ్చింది.