NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను నోటీసు
    తదుపరి వార్తా కథనం
    చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను నోటీసు
    చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను నోటీసు

    చంద్రబాబు నాయుడుకు ఆదాయపు పన్ను నోటీసు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 01, 2023
    10:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఆదాయపుపన్నుశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

    ఆగస్టు 4న హైదరాబాద్‌లోని సెంట్రల్ సర్కిల్ ఈ నోటీసు పంపింది. కొన్ని మౌలిక సదుపాయాల కంపెనీల నుండి ₹118 కోట్ల కిక్‌బ్యాక్‌కు సంబంధించి నాయుడుని ప్రశ్నించింది.

    ఈ మొత్తాన్ని"వెల్లడించని ఆదాయం"గా పరిగణించాలా లేక చట్టం ప్రకారం ప్రాసెస్ చేయాలా అనే దానిపై డిపార్ట్‌మెంట్ వివరణ కోరింది.

    చంద్రబాబు ఆదాయ వ్యవహారాలను పరిశీలించిన ఐటీశాఖ సెంట్రల్‌ సర్కిల్ ప్రొసీడింగ్స్‌కు ఉపక్రమించినట్లు సెక్షన్ 153సి ప్రకారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.

    ఈ సెక్షన్ 153సి ప్రకారం ఐటీ శాఖకు విస్తృత సోదాలు నిర్వహించేందుకు అవకాశాలు ఉంటాయి.

    Details 

    SPCL సంస్థ తరపున MVP టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నారు: ఐటీ 

    అయా సంస్థల ప్రమేయం ఉందని నిర్ధారించే ప్రాథమిక ఆధారాలు గనుక లభిస్తే ఐటీ శాఖ వారిపై చర్యలు తీసుకుంటుంది.

    బీజేపీతో తెలుగుదేశం ఈ సారి ఎన్నికలలో కలిసి ముందడుగు వేస్తోందన్న ప్రచారాలు జరుగుతున్న వేళ ఐటీ శాఖ నోటీసులు కీలకంగా మారాయి.

    షాపూర్జీ పల్లోంజీ & కో. ప్రైవేట్ లిమిటెడ్ (SPCL) తరపున ఆంధ్రప్రదేశ్‌లో టెండర్ ప్రక్రియలో పాల్గొన్న మనోజ్ వాసుదేవ్ పార్ధసాని (MVP) ప్రాంగణంలో సోదాల నుండి ఈ దర్యాప్తు మొదలైంది.

    2017 నుంచి SPCL సంస్థ తరపున MVP టెండర్ల ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. 2019లో జరిపిన సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

    Details 

    నగదు లావాదేవీల కోసం సబ్‌ కాంట్రాక్టులను ఏర్పాటు చేశాం: ఐటీ  

    ఎంక్వయిరీ లో భాగంగా ఐటీ శాఖ MVP బోగస్‌ కాంట్రాక్టులు, వర్క్‌ ఆర్డర్‌లతో SPCL నిధులు మళ్ళించినట్టు అంగీకరించినట్టు స్పష్టం చేసింది.

    నగదు లావాదేవీల కోసం సబ్‌ కాంట్రాక్టులను ఏర్పాటు చేశామని MVP ఒప్పుకున్నట్టు ఐటీ శాఖ పేర్కొంది.

    ఐటీ శాఖ సోదాల సమయంలో రికవర్ చేసిన స్టేట్‌మెంట్‌లు, చాట్‌లు, మెటీరియల్‌లు ఈ విషయానికి మద్దతుగా నిలుస్తున్నాయి.

    పార్టీ కోసం నిధులు కోరుతూ 2016లో నాయుడు వ్యక్తిగత కార్యదర్శితో MVP సంప్రదింపులు జరిపినట్లు నోటీసులో పేర్కొన్నారు.

    Details 

    కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో నాయుడు సమావేశం

    అసలు పనులు లేకుండానే ప్రాజెక్టుల నుంచి నిధులు మళ్లించారని, వివిధ సంస్థల ద్వారా చంద్రబాబుకు లబ్ధి చేకూరిందని ఆరోపించారు.

    టిడిపి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య పొత్తు ఉండవచ్చనే ఊహాగానాలు తలెత్తడంతో, జూన్‌లో నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.

    నాయుడు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయంపై విచారణలకు ఇంకా స్పందించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    చంద్రబాబు నాయుడు

    ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు భారతదేశం
    గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ భారతదేశం
    మూడు రాజధానులు V/S ఒక రాజధాని..! వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025