NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన
    గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన

    CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 30, 2024
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో 90శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

    మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగిందని గుర్తు చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్‌ నేతృత్వంలో రాయలసీమకు తెలుగుగంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చినట్లు చెప్పారు.

    వెలిగొండ, తోటపల్లి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభించామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నీటి కొరతను తగ్గించడమే లక్ష్యమని వివరించారు.

    రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

    ఉద్యాన పంటలతో అనంతపురం తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వివరించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌గా మారబోతుందని చంద్రబాబు అన్నారు.

    Details

    రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ప్రతిపాదనలు

    బనకచర్ల రెగ్యులేటర్‌ ద్వారా రోజుకు కనీసం 2 టీఎంసీల నీటిని తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా కరవు, వరదల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

    మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణా నదికి నీటిని మళ్లించడం, రెండో దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మాణం, మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తామన్నారు.

    గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రూ.80 వేల కోట్ల వ్యయంతో నిర్మించేందుకు డీపీఆర్‌ రూపొందించామని, 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు తెలిపారు.

    ప్రైవేటు సంస్థల సహకారంతో నిర్మాణం, నిర్వహణ పనులను చేపట్టే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి భావితరాలకు నీటి సమస్యలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి! కోవిడ్
    NTR : 'డ్రాగన్' మూవీలో తారక్‌తో కలిసి నేషనల్ క్రష్ స్టెప్పులు..? జూనియర్ ఎన్టీఆర్
    Jivi Babu: బలగం నటుడు కన్నుమూత టాలీవుడ్
    Asaduddin Owaisi: పాక్ మరోసారి దాడి చేస్తే నాశనం చేస్తాం : ఓవైసీ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు  భారతదేశం
    CM Chandrababu: వచ్చే నెలలో పోలవరానికి చంద్రబాబు.. జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్ష పోలవరం
    CM Chandrababu: రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ రంగాల్లో అదానీ భారీ పెట్టుబడులు! అదానీ గ్రూప్
    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు నీతి ఆయోగ్

    ఆంధ్రప్రదేశ్

    AP Tourism Policy 2024-2029: ఏపీ పర్యాటక పాలసీ 2024-2029.. పెట్టుబడుల కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు జనసేన
    Daikin: ఏపీలో జపాన్‌కు చెందిన డైకిన్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు జపాన్
    Rain Alert:ఆంధ్రప్రదేశ్‌‌లో భారీ వర్షాలు..కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. భారీ వర్షాలు
    Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వారందరి పింఛన్‌లు కట్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025