NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 
    చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు

    CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 11, 2025
    03:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.

    అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

    ఈ హైడ్రోజన్‌ను ఎరువులు, రసాయనాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తారని, హరిత ఇంధనం ద్వారా తయారైన ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్నట్లు చెప్పారు.

    అదేవిధంగా, హైడ్రోజన్‌ వాడడం వల్ల అల్యూమినియం మరియు ఉక్కు ఉత్పత్తిలో వేడి తగ్గే అవకాసం ఉన్నదని వివరించారు.

    ఈ సందర్భంగా, గ్రీన్‌కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్‌ చేస్తుందన్నారు.

    అక్కడ గ్రీన్‌ అమోనియా తయారీ జరిగి విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. ఈ ప్లాంట్‌లో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెడతారని పేర్కొన్నారు.

    Details

    ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సౌర ఫలకాలు

    అదనంగా రిలయన్స్‌ కంపెనీ 500 బయో కంప్రెస్డ్‌ గ్యాస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుందని, ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారని తెలిపారు.

    బయోగ్యాస్‌ ఉత్పత్తికి గడ్డి ఉపయోగిస్తారని, ఈ గడ్డిని పెంచేందుకు రైతులకు ఎకరాకు రూ.30 వేలు కౌలుగా చెల్లించనున్నారు. స్వాపింగ్‌ బ్యాటరీల మోడల్‌ను బెంగళూరు సంస్థ కుప్పానికి తీసుకువచ్చింది.

    సూర్యఘర్‌ లో నివసిస్తున్న ఇళ్ల యజమానులకు ఈ బ్యాటరీల ఛార్జింగ్‌కు డబ్బు చెల్లిస్తారని, ఇది వారి అదనపు ఆదాయం అవుతుందని చెప్పారు.

    సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలతో కూడా ముందుకు వెళ్ళిపోతున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    చంద్రబాబు నాయుడు

    GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్ ఆంధ్రప్రదేశ్
    Chandrababu: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు శ్రీశైలం
    Tata Group: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏపిలో మరో 20 హోటళ్లు.. ముఖ్యమంత్రితో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ భేటీ  టాటా గ్రూప్

    ఆంధ్రప్రదేశ్

    Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే! చంద్రబాబు నాయుడు
    Sankranti holidays: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ భారతదేశం
    Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి కడప
    Amaravati: అమరావతిలో బిట్స్‌ క్యాంపస్.. ఆలయ నమూనాలో నిర్మాణం అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025