NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
    నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు.

    తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుప్పం రూపురేఖలను మార్పుచేసేందుకు రూపొందించిన 'స్వర్ణ కుప్పం' పథకం ప్రారంభానికి ఈ పర్యటన ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది.

    వచ్చే ఐదేళ్లలో కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం 'స్వర్ణ కుప్పం-విజన్ 2029' పథకాన్ని ప్రారంభించనున్నారు.

    ఆది, సోమ, మంగళవారం సీఎం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    నేడు ద్రవిడ యూనివర్శిటీలో 'స్వర్ణ కుప్పం-విజన్ 2029' డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు.

    Details

    కుప్పం రెండు కొత్త డైరీలు ఏర్పాటు

    ఈ పథకంతో కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉంచారు. సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

    పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కుప్పంలో రెండు కొత్త డైరీలను ఏర్పాటు చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

    స్వర్ణ కుప్పం-విజన్ 2029 విడుదల అనంతరం సోమవారం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.

    సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

    Details

    జనవరి 8న విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు

    రాత్రికి ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం సీఎం టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలుస్తారు.

    మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

    సాయంత్రం కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

    ఇక జనవరి 8వ తేదీ ఉదయం సీఎం విశాఖపట్టణానికి వెళ్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    కుప్పం

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు నీతి ఆయోగ్
    Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం..  టీ చేసిన సీఎం  ఆంధ్రప్రదేశ్
    Chandrababu: తిరుపతిలో బాలికపై హత్యాచార ఘటన.. స్పందించిన సీఎం చంద్రబాబు తిరుపతి
    Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్

    కుప్పం

    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు
    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025