NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా 
    తదుపరి వార్తా కథనం
    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా 
    మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా

    Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. అమిత్ షా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 07, 2024
    03:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మావోయిస్టు తీవ్రవాదం ప్రస్తుతం తుదిదశకు చేరుకుందని, దీని నిరోధం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందనికేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు.

    దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో అమిత్‌ షా అధ్యక్షతన ఈ చర్చలు జరిగాయి. దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తన చివరి దశకు చేరుకుందని షా పేర్కొన్నారు.

    ఇప్పటివరకు 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టారని, 2024లో 202 మంది మావోయిస్టులు మృతి చెందగా, 723 మంది లొంగిపోయారని ఆయన వెల్లడించారు.

    ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత దృఢంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    Details

    శాంతి సాధించేందుకు కృషి

    మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను శాంతి సాధించేందుకు అన్ని రాష్ట్రాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని అమిత్‌ షా స్పష్టం చేశారు.

    ఛత్తీస్‌గఢ్‌ విజయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ మావోయిస్టుల లొంగడం రాష్ట్రం మొత్తం, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజలకు అభివృద్ధి పథకాల ప్రయోజనాలు అందించడమే తమ లక్ష్యమని షా తెలిపారు.

    గత పదేళ్లలో మోదీ సర్కార్‌ చేసిన కృషిని గురించి అమిత్‌ షా వివరించారు.

    Details

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకం

    11,500 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించడం, 15,300 సెల్‌ఫోన్‌ టవర్లు ఏర్పాటు చేయడం, 165 ఏకలవ్య పాఠశాలలు నిర్మించడం వంటి అభివృద్ధి చర్యలు తీసుకున్నామని చెప్పారు.

    గతంలో 16,400 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, ప్రస్తుతం ఈ సంఖ్య 7,700కు తగ్గిందని వెల్లడించారు.

    హింసాత్మక ఘటనల వల్ల పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70 శాతం తగ్గాయని, హింసాత్మక జిల్లాల సంఖ్య 96 నుంచి 42కు తగ్గిందన్నారు.

    ఇలాంటి సంఘటనలు నమోదయ్యే పోలీసు స్టేషన్ల సంఖ్య కూడా 465 నుంచి 171కు తగ్గిందని అమిత్‌ షా వెల్లడించారు. ఈ విజయానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయమే కీలకమని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    దిల్లీ

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    అమిత్ షా

    Amit Shah: అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా  తాజా వార్తలు
    SIMI: సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం  భారతదేశం
    India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం  మయన్మార్
    Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా తాజా వార్తలు

    దిల్లీ

    Champai Soren : బీజేపీలోకి చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్ ఇండియా
    Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి రాజ్‌నాథ్ సింగ్
    Vinesh Phogat: త్వరలో కాంగ్రెస్‌లోకి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్! స్పోర్ట్స్
     Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన.. ఒక రోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025