NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు
    దలైలామాతో భేటీ తర్వాత అమెరికాపై చైన్యా తీవ్ర అభ్యంతరం

    దిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 10, 2023
    04:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం రాజధాని దిల్లీ వేదికగా అమెరికా - చైనా విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గంలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే ఉన్నతాధికారి ఉజ్రా జియా తీరును చైనా తప్పుబట్టింది.

    ఈ మేరకు జియా, టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. ఈ క్రమంలోనే అమెరికా తీరుపై డ్రాగం దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

    టిబెట్ చైనీస్ అంతర్గత అంశాల్లో యూఎస్ జోక్యం చేసుకోవడం ఆపాలని చైనా హెచ్చరికలు జారీ చేస్తోంది. భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి వాంగ్‌ షియావ్‌ జియాన్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

    షిజాంగ్‌ తమ దేశ అంతర్భాగమన్న సంగతిని అమెరికా గుర్తించి, దాని నిబద్ధతకు కట్టుబడి ఉండేలా యూఎస్ కృషి చేయాలని వాంగ్ సూచించారు.

    details

    జులై 8 నుంచి 14 వరకు భారత్, బంగ్లా పర్యటనలో ఉజ్రా జియా

    దలైలామా బృందం చేపట్టనున్న చైనా వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వకూడదన్నారు.

    షిజాంగ్‌ (టిబెట్ చైనీస్ ప్రాంతం) వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గతమైనవని, వీటిలో బయటి శక్తుల ప్రమేయానికి అర్హత లేదన్నారు.

    టిబెట్‌ స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోరుకునే శక్తులు, విదేశీ దౌత్యవేత్తల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

    అయితే అమెరికా ఉన్నతాధికారి ఉజ్రా జియాకు టిబెట్‌ అఫైర్స్ కోఆర్డినేటర్ హోదా ఇవ్వడాన్ని చైనా ప్రతినిధులు ఖండించారు.

    ఉజ్రా జియా జులై 8 నుంచి 14 వరకు ఆసియా పర్యటనలో భాగంగా భారత్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె భారత ఉన్నతాధికారులనూ కలవనుండటం విశేషం.

    జియా వెంట అమెరికా విదేశాంగ సహాయ మంత్రి డొనాల్డ్‌ తదితరులు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    అమెరికా
    చైనా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    దిల్లీ

    మద్దతు ధర కోసం కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు  హర్యానా
    దిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం  భూకంపం
    ఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం విమానం
    ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్‌ పిట్‌లోకి పైలట్ గర్ల్‌ ఫ్రెండ్‌‌.. 30 లక్షల ఫైన్ ఎయిర్ ఇండియా

    అమెరికా

    అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్  భారతదేశం
    భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల భారతదేశం
    ఇంటి అద్దెకు భయపడి విమానంలో ఆఫీసుకు వెళ్తున్న యువతి న్యూజెర్సీ
    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    చైనా

    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక కోవిడ్
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు భారతదేశం
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025