NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!  
    తదుపరి వార్తా కథనం
    Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!  
    భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!

    Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్‌-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!  

    వ్రాసిన వారు Stalin
    Jul 10, 2023
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది.

    గత కొన్నేళ్లలో రక్షణరంగంలో భారత్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలు, ఆయుధాలను కొనుగోలు చేసింది.

    తాజాగా ఫ్రాన్స్‌తో భారత్‌ రాఫెల్‌-ఎం(Rafale-M)ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

    ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటికే వైమానికదళం కోసం రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.

    అయితే ఇప్పుడు నావికా దళం కోసం రాఫెల్‌-ఎం విమానాలను కొనేందుకు సిద్ధమవుతోంది.

    ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం భారత్ 26 రాఫెల్‌-ఎం యుద్ధ విమానాలు, మూడు అటాక్ సబ్‌మెరైన్‌లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ జులై 13,14తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు.

    ఈ పర్యటనలోనే ఒప్పందంపై మోదీ సంతకం చేసే అవకాశం ఉంది.

    భారత్

    జులై 13న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్‌ సమావేశం

    14న జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో బాస్టిల్ డే పరేడ్‌ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అధ్యక్షుడు మక్రాన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

    ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ 26 రాఫెల్ ఎం సముద్ర యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది.

    జులై 13న ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఎసీ) సమావేశం జరగనుంది.

    భారత నౌకాదళానికి 26 రాఫెల్-ఎమ్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు జూలై 13న జరగనున్న సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

    భారత్

    రాఫెల్-ఎమ్ ప్రత్యేకతలు ఇవే

    ఫ్రాన్స్ నుంచి భారత్ 26రాఫెల్-ఎమ్ విమానాలను కొనుగోలు చేయనుంది. రాఫెల్-ఎమ్ అనేది ఒక సముద్ర యుద్ధ విమానం.

    రాఫెల్-ఎమ్ యుద్ధ విమానానికి రాఫెల్ మారిటైమ్ అని పేరు పెట్టారు.

    ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ రాఫెల్-ఎం విమానాన్ని తయారు చేసింది. రాఫెల్ కంటే 80శాతం అత్యాధునిక సాంకేతికతతో రాఫెల్-ఎమ్ విమానాన్ని తీర్చి దిద్దారు.

    అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ చేపడుతున్న ఫ్రాన్స్ పర్యటన భారత రక్షణ రంగానికి చాలా కీలకంగా మారనుంది.

    ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్-ఎమ్ ఫైటర్ జెట్‌లను సముద్ర నిఘా, పోరాటానికి ఉపయోగిస్తారు.

    అమెరికన్ ఫైటర్ హార్నెట్ కంటే ఈ విమానం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

    విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో రాఫెల్-ఎమ్ ఫైటర్ జెట్‌లను మోహరించనున్నారు.

    భారత్ 

    రాఫెల్-ఎమ్ విమానం బరువు 10,600 కిలోలు

    రాఫెల్-ఎమ్ సముద్ర యుద్ధ విమానం 15.27మీటర్ల పొడవు, 5.34 మీటర్ల ఎత్తు, 10,600కిలోల బరువు ఉంటుంది. దీని ఇంధన సామర్థ్యం 4700కిలోలు.

    అత్యధిక ఎత్తులో రాఫెల్-ఎమ్ విమానం గంటకు 1912కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. తక్కువ ఎత్తులో దాని వేగం గంటకు 1390 కిలోమీటర్లు ఉంటుంది.

    ఇది మూడు డ్రాప్ ట్యాంకులతో 3700 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ విమానం యుద్ధనౌకల్లో టేకాఫ్, ల్యాండ్ సులువుగా అవుతుంది.

    గతంలో ఫ్రాన్స్ నుంచి భారత్ రాఫెల్ జెట్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 36రాఫెల్ విమానాలు ఉన్నాయి.

    ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 4.5 తరం రాఫెల్ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఫ్రాన్స్
    యుద్ధ విమానాలు
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    భారతదేశం

    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట  చైనా
    బ్రిటన్‌: నాటింగ్‌హామ్ కత్తి దాడిలో ముగ్గురు మృతి; అందులో భారతీయ సంతతి యువతి బ్రిటన్
    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు
    అమెరికా నుంచి దశలవారీగా MQ 9B డ్రోన్ల కొనుగోలు చేయనున్న భారత్  అమెరికా

    ఫ్రాన్స్

    సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత అంతర్జాతీయం
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం ప్రపంచం

    యుద్ధ విమానాలు

    ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు బెంగళూరు
    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు అరుణాచల్ ప్రదేశ్
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    తాజా వార్తలు

    నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు  నరేంద్ర మోదీ
    డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు  సుప్రీంకోర్టు
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025