NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / China : 'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'
    తదుపరి వార్తా కథనం
    China : 'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'
    'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'

    China : 'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 24, 2023
    04:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యుమోనియా కలకలంతో డ్రాగన్ చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడి చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆస్పత్రులు బాధితులతో నిండిపోతున్నాయి.

    అయితే ఈ వ్యవహారంపై భారత్ కీలక ప్రకటన చేసింది. ఫ్లూ కేసులు పెరగడంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించామని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపింది. భారతదేశంపై ఈ ముప్పు ఏమీ ఉండబోదని స్పష్టం చేసింది.

    ప్రస్తుతానికి భారతీయులకు దీనిపై ఆందోళన అవసరం లేదని, ఒకవేళ విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది.

    చైనాలో ఈ తరహా కేసులు పెరుగుతుండటం ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ప్రస్తుతానికి చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను H9N2గా గుర్తించారు. Avian influenza virusగా పిలుస్తున్నారు.

    details

    వైద్య అధికారులను అప్రమత్తం చేసిన కేంద్రం. 

    చైనాలో కేసులు పెరిగిన వెంటనే డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (DGHS) ప్రత్యేకంగా సమావేశమైంది.

    భారత్‌లో ఫ్లూ వ్యాపిస్తే ఎలా కట్టడి చేయాలో చర్చించింది.మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు లేవని, మరణాల రేటు సైతం తక్కువేనని అభిప్రాయపడింది.

    కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు H9N2 కేసులను పరిశీలిస్తోందని, ప్రస్తుతానికి భారత్‌కి వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొంది.

    మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ సోకుతుందా లేదా అన్నదానిపై కేంద్రం, వైద్య అధికారులను అప్రమత్తం చేసింది.

    మరోవైపు చైనా విషయంలో కొవిడ్ తర్వాత ఆ స్థాయిలో ఆరోగ్య అత్యవరస స్థినిని చైనా ఎదుర్కొంటోంది.

    ఈ క్రమంలోనే దేశంలోని స్కూల్స్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో కెపాసిటీకి మించి బాధితులు చేరుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం   సుప్రీంకోర్టు
    దేశంలో మరోసారి తెరపైకి జమిలి ఎన్నికలు.. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఎన్నికలు
    రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా జీఎస్టీ
    సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్‌ ముద్రించొద్దు.. యూనివర్సిటీలకు యూజీసీ లేఖ విద్యా శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025