NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు
    తదుపరి వార్తా కథనం
    News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు
    చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లపై పోలీసుల దాడి

    News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 03, 2023
    12:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు చేపట్టడం కలకలం రేపింది.

    ప్రముఖ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' కు చైనాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కారణంగా ఆ సంస్థ కార్యాలయం, అందులో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేశారు.

    దాదాపుగా 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

    అయితే ఉద్యోగుల వద్ద ఉన్న ల్యాప్ ట్యాప్‌లు, మొబైల్ ఫోన్‌లను సిబ్బంది స్వాధనం చేసుకున్నారు.

    అయితే సదరు ఉద్యోగులను విచారణలో పాల్గొనాల్సిందిగా వారికి సమన్లు కూడా జారీ చేసినట్లు సమాచారం.

    న్యూస్ క్లిక్ సంస్థ చైనాకు అనుకూలంగా స్పాన్సర్డ్ వార్తలను నడుపుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

    Details

    పీఎమ్ఎల్ఏ కేసులో న్యూస్ క్లిక్‌ను విచారిస్తున్న ఈడీ

    దిల్లీ పోలీసులు తన ఇంటికొచ్చి, ల్యాప్ టాప్‌ను ఎత్తుకెళ్లారని న్యూస్ క్లిక్‌ జర్నలిస్టులో ఒకరైన అభిసార్ శర్మ పేర్కొన్నారు.

    మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ) కేసులో న్యూస్ క్లిక్ ను ఈడీ విచారిస్తోంది.

    న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ.38.05 కోట్ల మేర విదేశీ నిధుల మోసానికి పాల్పడిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.

    చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి నేవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్ వర్క్ లో ఈ సంస్థ భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    చైనా

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    దిల్లీ

    భారత్‌లో అంతర్జాతీయ ఈవెంట్.. అక్టోబర్ 12 నుంచి G20 పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం భారతదేశం
     జీ20 సదస్సు వేళ.. దిల్లీలో పోలీసుల 'కార్కేడ్ రిహార్సల్'.. ఈ మార్గాల్లో ఆంక్షల విధింపు జీ20 సమావేశం
    Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు కర్ణాటక
    G20 సమ్మిట్ నేపథ్యంలో..దిల్లీ మెట్రో కీలక ప్రకటన భారతదేశం

    చైనా

    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు  ఫ్రాన్స్
    చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు భారీ వర్షాలు
    చైనాలో భారీ భూకంపం.. 10 మందికి గాయాలు భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025