NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన
    2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన

    2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన

    వ్రాసిన వారు Stalin
    Jul 18, 2023
    01:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు.

    2024ఎన్నికల్లో తాను హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.

    ప్రస్తుతం హాజీపూర్ ఎంపీగా చిరాగ్ బాబాయ్, కేంద్రమంత్రి పశుపతి కుమార్ పారస్ ఉన్నారు.

    తాను తిరిగి ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్లు చిరాగ్ సోమవారం ప్రకటించారు. ఇది జరిగిన ఒకరోజు తర్వాత హాజీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తాననడం గమనార్హం.

    ఎన్డీఏలోకి తిరిగి రావడంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయని చిరాగ్ చెప్పారు. స్నేహపూర్వక ఒప్పందం కారణంగానే తాను ఎన్డీఏలోకి తిరిగి చెరినట్లు చెప్పారు.

    2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, 2025 బిహార్ ఎన్నికలే లక్ష్యంగా తాము పని చేస్తామని స్పష్టం చేశారు.

    చిరాగ్

    రామ్ విలాస్ మరణంతో రెండుగా చీలిన లోక్ జనశక్తి పార్టీ 

    లోక్ జనశక్తి వ్యవస్థాపకుడు రామ్ విలాస్ మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే.

    రామ్ విలాస్ మరణం తర్వాత ఆయన తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ తన వర్గంతో కలిసి ఎన్డీఏలో చేరారు. అనంతరం ఆయన కేంద్రమంత్రి అయ్యారు.

    ఈ క్రమంలో ఒక వర్గానికి రామ్ విలాస్ కుమారుడు చిరాగ్ నాయకత్వం వహిస్తుండగా, మరో వర్గానికి పశుపతి నాయకుడిగా ఉన్నారు.

    అప్పటి నుంచి ఇరు వర్గాలు మధ్య వివాదాలు కొసాగుతూనే ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో రామ్ విలాస్‌కు కంచుకోటగా ఉన్న హాజీపూర్ నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేసేందుకు పరాస్, చిరాగ్ ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారు.

    ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రయత్నించినా, అది ఫలించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరాగ్ పాశ్వాన్
    తాజా వార్తలు

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    చిరాగ్ పాశ్వాన్

    Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు లోక్ జనశక్తి పార్టీ/ ఎల్‌జేపీ

    తాజా వార్తలు

    Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం నేపాల్
    Delhi: దిల్లీలో యమునా నది నీటిమట్టం ఆల్ టైమ్ హై; 45ఏళ్ల రికార్డు బద్దలు; కేజ్రీవాల్ ఆందోళన  దిల్లీ
    Hyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్  తెలంగాణ
    Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు  రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025