
Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్లపై సీఐడీ కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
భూ పట్టాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్పై నేర పరిశోధన విభాగం(సీఐడీ)కేసు నమోదు చేసింది.
వీరిద్దరూ తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చంద్రబాబు,లోకేష్లు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని సీఐడీ ప్రమేయానికి ముందే వైసీపీ ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ చేపట్టి ఏ1గా చంద్రబాబు,ఏ2గా లోకేష్పై ఎఫ్ఐఆర్నమోదు చేసింది.
ఈనేతలు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని సీఐడీ దర్యాప్తు చేసి,వారి ప్రమేయం ఏ మేరకు ఉందో తేల్చనుంది.
ఈ విషయమై చంద్రబాబు,లోకేశ్లు ఆరోపణలను ఖండించారు.విచారణకు అధికారులకు సహకరిస్తామని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీడీపీ ఫెక్ ప్రచారంపై సీఐడీ విచారణ
టీడీపీ ఫెక్ ప్రచారంపై సీఐడీ విచారణ
— Rahul (@2024YCP) May 5, 2024
చంద్రబాబు ఏ1, నారా లోకేష్ ఏ2 గా ఎఫ్ ఐ ఆర్ నమోదు
ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై ఐ వి ఆర్ ఎస్ కాల్స్ తో తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ
ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ ఐ ఆర్ కట్టి
విచారణ ప్రారంభించిన సి ఐ డి
చంద్రబాబు, లోకేష్ తో పాటు 10 మందిపై కేసు నమోదు
ఐ… pic.twitter.com/AcJMJldKJd