NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Climate Risk: డేంజర్ జోన్‌లో ముంబయి; దేశంలోని 9రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వాతావరణం
    తదుపరి వార్తా కథనం
    Climate Risk: డేంజర్ జోన్‌లో ముంబయి; దేశంలోని 9రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వాతావరణం

    Climate Risk: డేంజర్ జోన్‌లో ముంబయి; దేశంలోని 9రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వాతావరణం

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2023
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2050నాటికి ప్రపంచంలోని 50రాష్ట్రాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారనుందని ప్రముఖ వాతావరణ పరిశోధన సంస్థ క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ (ఎక్స్‌డీఐ) పేర్కొంది. 'గ్రాస్ డొమెస్టిక్ క్లైమెట్ రిస్క్' పేరుతో ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.

    వాతావరణం ప్రమాదకరంగా మారే 50రాష్ట్రాల్లో 80శాతం భారతదేశం, చైనా, అమెరికాలోనే ఉన్నట్లు ఎక్స్‌డీఐ పేర్కొంది.

    భారతదేశంలో పంజాబ్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ, అసోం రాష్ట్రాల్లో వాతావరణం రోజురోజుకు క్షిణించిపోతున్నట్లు నివేదిక చెబుతోంది.

    ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రాలు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించింది.

    ఎక్స్‌డీఐ నివేదిక భారత వాణిజ్య రాజధాని ముంబయి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ నగరంపై వాతావరణ మార్పుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పింది.

    వాతావరణం

    ప్రభావిత ప్రాంతాలు చైనాలోనే ఎక్కువ

    ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొదటి 50రాష్ట్రాల్లో చైనాదే అధిక వాటా. తూర్పు, దక్షిణ ప్రాంతాలలోని యాంగ్జీ, పెర్ల్ నదుల పరీవాహక ప్రాంతాలతో పాటు డెల్టా ప్రాంతాలు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్నాయి.

    అమెరికాలో కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు అత్యంత ప్రభావిత ప్రాంతాలని ఎక్స్‌డీఐ నివేదిక చెబుతోంది.

    టాప్-50 ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్, పాకిస్థాన్, ఇండోనేషియా దేశాలు కూడా ఉన్నాయి.

    వాతావరణ మార్పుల ప్రభావం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

    వాతావరణ మార్పుల వల్ల ఉపరితల వరదలు, తీరప్రాంత వరదలు విపరీతమైన వేడి, అడవులు కాలిపోవడం, భూకంపాలు, మంచుప్రాంతాలు కరిగిపోవడం, తుపాను లాంటివి సంభవిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    చైనా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    భారతదేశం

    కొచ్చిలో కొత్త గెస్ట్ ఎక్స్పీరియెన్స్ సెంటర్ ను ప్రారంభించిన Lexus కొచ్చి
    జనవరిలో 4.7 శాతంకు తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థ
    ఫిబ్రవరి 15న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో తుపాకీ మోత, 10 మంది మృతి అంతర్జాతీయం
    ఉద్యోగులు చేసిన తప్పిదం వల్లే విమానాలు నిలిచిపోయాయి: ఎఫ్ఏఏ విమానం
    అమెరికా: మరో మూడు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు, 9మంది మృతి తుపాకీ కాల్పులు
    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం చంద్రుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025