NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు
    భారతదేశం

    బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు

    బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 16, 2023, 03:15 pm 1 నిమి చదవండి
    బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు- మూడు రోజులుగా ఇంటికెళ్లని ఉద్యోగులు
    బీబీసీ ఆఫీసుల్లో 45గంటలుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు

    దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ సోదాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 45 గంటలకు పైగా ఏకధాటిగా అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీ ఆఫీసులోని 10మంది సీనియర్ ఉద్యోగులు మూడు రోజులుగా తమ ఇళ్లకు వెళ్లకుండా ఐటీ అధికారులతోనే ఉన్నారు. అధికారులు అడిగిన వివరాలు చెబుతూ, వారికి సహకరిస్తున్నారు. సర్వే ఎప్పుడు ముగుస్తుందో ఖచ్చితంగా చెప్పలేమని ఐటీ ఆధికారులు చెబుతున్నారు. బీబీసీ ఆర్థిక లావాదేవీలు, కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలను ఐటీ అధికారులు బీబీసీ ఉద్యోగులను ద్వారా తెలుసుకొని రికార్డు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి డేటాను కాపీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం: బీబీసీ ఉద్యోగులు

    బీబీసీ సిబ్బంది ఇంటి నుంచే పని చేస్తున్నారని ఒక ఉద్యోగి చెప్పారు. ఈ సోదాల గురించి ఆదాయపు పన్ను శాఖ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ అధికారులకు బీబీసీ సహకరిస్తున్నట్లు ఉద్యోగులు చెపారు. ఇదిలా ఉంటే, బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులను ప్రతిపక్షాలు ఇప్పటికే ఖండించాయి. దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీగా కాంగ్రెస్ అభివర్ణించింది. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    దిల్లీ
    ముంబై
    బీబీసీ

    దిల్లీ

    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌  మనీష్ సిసోడియా

    ముంబై

    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్

    బీబీసీ

    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  డాక్యుమెంటరీ
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు ప్రపంచం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023