NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్.. 
    తదుపరి వార్తా కథనం
    RN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్.. 
    'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్..

    RN Ravi: 'జాతీయ గీతానికి అవమానం'.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 06, 2025
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపణలు చేశారు.

    శీతాకాల అసెంబ్లీసమావేశాల ప్రారంభ రోజున సంప్రదాయ ప్రకారం సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్నా,ఆయన దాన్ని నిరాకరించి వెళ్లిపోయారు.

    రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సాధారణంగా సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం"తమిళ్ థాయ్ వాల్తు"ను ఆలపించడంతో పాటు సభ ముగిసినప్పుడు జాతీయ గీతం పాడుతారు.

    అయితే గవర్నర్ రవి ఈ నిబంధనలో మార్పు చేయాలని,సభ ప్రారంభంలోనే జాతీయ గీతం ఆలపించాలని కోరారు.

    సభా నాయకుడు ముఖ్యమంత్రి స్టాలిన్,స్పీకర్ ఎం అప్పావు ఈ విజ్ఞప్తిని తిరస్కరించడంతో గవర్నర్ సభ నుంచి నిష్క్రమించారు.

    అనంతరం గవర్నర్‌ చదవాల్సిన సంప్రదాయ ప్రసంగాన్ని స్పీకర్ ఎం అప్పావు చదివి వినిపించారు.

    వివరాలు 

    గవర్నర్‌ విజ్ఞప్తిని తిరస్కరణ 

    ఈ ఘటనపై రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీలో భారత రాజ్యాంగం, జాతీయ గీతాన్ని అవమానించినట్లు పేర్కొంది.

    "జాతీయ గీతాన్ని గౌరవించడం భారత రాజ్యాంగంలో మొదటి ప్రాథమిక విధి. రాష్ట్రాల శాసనసభల ప్రారంభం, ముగింపులో జాతీయ గీతం పాడటం సాధారణ ఆచారం.

    అయితే తమిళనాడు అసెంబ్లీ ప్రారంభంలో తమిళ గీతాన్ని మాత్రమే పాడారు.

    గవర్నర్‌ జాతీయ గీతం ఆలపించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు.

    ఈ కారణంగా గవర్నర్ రాజ్యాంగ విలువలను, జాతీయతను అగౌరవపరిచిన పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర ఆందోళన చెందారు" అని ప్రకటనలో పేర్కొన్నారు.

    వివరాలు 

    'ద్రావిడియన్ మోడల్' పదం చదవడానికి నిరాకరించి..

    గత సంవత్సరం ఫిబ్రవరిలో కూడా గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.

    ప్రసంగం ప్రతిలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై పేర్లు, 'ద్రావిడియన్ మోడల్' అనే పదం, శాంతిభద్రతల అంశాలకు సంబంధించిన భాగాలను ఆయన చదవడానికి నిరాకరించి సభ విడిచి వెళ్లిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తమిళనాడు

    Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం..  పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్  సినిమా
    Dabur: తమిళనాడులో రూ.400 కోట్లు పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించనున్న డాబర్  బిజినెస్
    Tamilnadu: లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉపాధ్యాయుడు అరెస్టు.. కోయంబత్తూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఘటన  భారతదేశం
    Tamilnadu: తమిళనాడు పటాకుల గోదాములో పేలుడు.. ఇద్దరు దుర్మరణం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025