NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nagababu: త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు.. ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    Nagababu: త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు.. ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు
    త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు

    Nagababu: త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లోకి నాగబాబు.. ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 10, 2024
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

    జనసేన ప్రధాన కార్యదర్శి కె. నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు సోమవారం వెల్లడించారు.

    జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

    నాగబాబును ఏ విధంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారు. మొదట మంత్రిగా నియమించి తర్వాత ఎమ్మెల్సీగా చేస్తారా లేదా ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

    ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానం నాగబాబుతో భర్తీ కానుంది.

    వివరాలు 

    ఈ ఎన్నికలకు దూరంగా వైసీపీ 

    రాష్ట్రంలో మూడు ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌బాబు, బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్యలను అభ్యర్థులుగా ప్రకటించారు.

    వైసీపీ, ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ స్థానాలు మునుపు వైసీపీలో ఉన్న నేతలు ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఖాళీ అయ్యాయి.

    ఈ ముగ్గురు నేతలు ప్రస్తుతం కొత్త పార్టీల్లో చేరగా, కృష్ణయ్య బీజేపీలో, మస్తాన్‌రావు, మోపిదేవి టీడీపీ లో ఉన్నారు.

    వివరాలు 

    బీసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు 

    రాజ్యసభ అభ్యర్థుల గురించి మాట్లాడుకుంటే, ఆర్‌.కృష్ణయ్య బీసీ హక్కుల కోసం పోరాడిన ప్రముఖ నాయకుడు.

    వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఆయన, 2014లో టీడీపీ తరఫున ఎల్‌బీనగర్‌ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.

    మరోవైపు, బీద మస్తాన్‌రావు, పారిశ్రామికవేత్తగా రొయ్యల వ్యాపారంలో ప్రత్యేకంగా ఎదిగి, జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన 2009లో కావలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

    సానా సతీష్‌బాబు సబ్‌ ఇంజినీరుగా కెరీర్‌ ప్రారంభించి, వ్యాపారరంగంలో ఎదిగి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా నియమితులవడం లాంఛనమేనని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి
    Ola Roadster X: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్ ఓలా
    WhatsApp: వాట్సాప్ స్టేటస్‌లో నాలుగు సరికొత్త ఫీచర్లు.. యూజర్లకు మరింత సౌకర్యం! వాట్సాప్
    Bandi Sanjay: 'కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామానే'.. బండి సంజయ్ ఫైర్ బండి సంజయ్

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: రీస్టార్ట్‌ ఏపీలో భారీ పెట్టుబడులు.. 10 భారీ పరిశ్రమల ఏర్పాటు.. 33,966 మందికి ఉపాధి  భారతదేశం
    Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినేట్ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ చంద్రబాబు నాయుడు
    Encumbrance Certificate Download : ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం భారతదేశం
    Group-1: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో కీలక విచారణ.. తీర్పు కోసం అభ్యర్థుల ఎదురుచూపులు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025