NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన
    తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన

    Cm Chandrababu : తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ పథకాలపై చంద్రబాబు కీలక ప్రకటన

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 01, 2025
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "తల్లికి వందనం","అన్నదాత సుఖీభవ" పథకాలపై మరోసారి కీలక ప్రకటన చేశారు.

    "తల్లికి వందనం" అమలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    పిల్లలు స్కూల్‌కి వెళ్లే లోపు ఈ పథకం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

    తల్లుల కృషికి గౌరవంగా, ఈ పథకాన్ని తప్పకుండా అమలు చేసి, రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.

    అదే విధంగా, "అన్నదాత సుఖీభవ" పథకం కింద మే నెల నుంచి రైతులకు సాయం అందిస్తామని చెప్పారు.

    కనీసం రూ. 20,000 అందించే విధంగా తొలి అడుగు వేస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ మొత్తం మూడు విడతల్లో చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.

    వివరాలు 

    ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు

    అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    2027 నాటికి పోలవరం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.

    వారి నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు అదనంగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

    రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌
    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్
    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: 'ఏపీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయి'.. జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: సోలార్ విద్యుత్ సరఫరా.. పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గం  భారతదేశం
    Amaravati: అమరావతి నిర్మాణానికి ఊతం.. హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.16,000 కోట్ల రుణం అమరావతి
    CM Chandrababu: అమరావతిలో డీప్‌ టెక్నాలజీ ఐకానిక్‌ భవనం.. 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్‌స్టేషన్లు అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025