NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: జనవరి నుంచి అమల్లోకి పీ4 విధానం.. 15శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యం
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: జనవరి నుంచి అమల్లోకి పీ4 విధానం.. 15శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యం
    జనవరి నుంచి అమల్లోకి పీ4 విధానం.. 15శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యం

    Chandrababu: జనవరి నుంచి అమల్లోకి పీ4 విధానం.. 15శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నూతన విధానాలతో అన్ని రంగాలను పునరుద్ధరించి మళ్లీ ఆర్థిక వృద్ధిని సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు.

    15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు.

    వ్యవసాయ అనుబంధ రంగాలు,పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిని సమీక్షించేందుకు సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

    ఈ సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు గత పదేళ్లలోని పరిస్థితులను వివరించారు.

    గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అన్ని రంగాలను నాశనం చేసి, ఆర్థిక వ్యవస్థను కుదేలించినందున ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

    కొత్త విధానాలను ప్రతి శాఖలో తీసుకురావడం ద్వారా, ఈ విధానాలను సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతిని సాధించాలని ఆయన తెలిపారు.

    వివరాలు 

    అప్పటి నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం వృద్ధి రేటును సాధించింది 

    ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, ప్రజలపై అదనపు భారాలు ఉండకుండా ప్రభుత్వ ఆదాయాలను పెంచే విధానాలను అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

    వ్యవసాయ రంగంలో సమగ్ర యంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులను తగ్గించవచ్చని చెప్పారు.

    ప్రభుత్వ పాత్ర పథకాలను ఇవ్వడంలో మాత్రమే కాకుండా, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

    2014 తరువాత విభజన కష్టాలు ఉన్నా,అప్పటి నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం వృద్ధి రేటును సాధించిందని ఆయన గుర్తు చేశారు.

    అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59 శాతానికి తగ్గిందని చెప్పారు.

    వివరాలు 

    ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానం

    2019లో తెలంగాణతో పోలిస్తే ఏపీ జీఎస్‌డీపీలో వ్యత్యాసం కేవలం 0.20 శాతం మాత్రమే ఉండగా, 2024లో ఈ వ్యత్యాసం 1.5 శాతానికి పెరిగింది.

    2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 కాగా, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో 2019 నాటికి అది రూ.1,54,031కి పెరిగిందని ఆయన వివరించారు.

    దక్షిణాది రాష్ట్రాల్లో,ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు.

    ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసి, నిర్ధిష్ట లక్ష్యాలతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

    వివరాలు 

    CSR ద్వారా పేదల జీవన ప్రమాణాలను పెంచడంలో  దోహదపడాలి: చంద్రబాబు 

    జనవరి నుంచి పీ4 విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. ఈ విధానంతో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తీసుకువచ్చేందుకు సహాయపడాలని కోరారు.

    ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు, సంపన్నులు,సంస్థలు CSR ద్వారా పేదల జీవన ప్రమాణాలను పెంచడంలో, వారికి అవకాశాలను కల్పించడంలో మెంటార్ లా దోహదపడాలని ముఖ్యమంత్రి సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    చంద్రబాబు నాయుడు

    Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్! హైదరాబాద్
    Chandrababu: నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు సమావేశం.. విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చ భారతదేశం
    Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు ప్రభుత్వం
    AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025