NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు
    యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు

    Chandrababu: యురేనియం తవ్వకాలకు అనుమతి లేదన్న సీఎం చంద్రబాబు.. బోర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి బోర్లు వేసే ప్రతిపాదనను ఆపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారు.

    ఈ నిర్ణయం ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఎందుకంటే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వారు కొద్దిరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

    2023 జూన్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో మొదటి దశ అనుమతులు మంజూరయ్యాయి.

    ఈ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలున్నాయన్న నిర్ధారణ తర్వాత, మరింత లోతైన పరిశోధన కోసం కేంద్ర ప్రభుత్వ 'ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌' (ఏఎండీ) 468.25 హెక్టార్లలో 68 బోర్‌ హోల్స్‌ వేసే ప్రతిపాదనను పంపించింది.

    Details

    అధికారికంగా ప్రకటించిన కర్నూలు జిల్లా కలెక్టర్

    అయితే ఈ తవ్వకాలు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

    ఈ నిర్ణయంపై వ్యతిరేక ప్రచారం కొనసాగుతుండగా, కొందరు వైసీపీ నాయకులు టీడీపీ ప్రభుత్వమే తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందని ఆరోపణలు చేసింది.

    ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి టీజీ భరత్ సహా పలువురు ఎమ్మెల్యేలు వివరించారు.

    దీనిపై సీఎం తక్షణమే స్పందించి, భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేశారు.

    తాజా నిర్ణయంతో, రాష్ట్రం నుంచి అనుమతులు లేకపోవడం వల్ల తదుపరి తవ్వకాలకు చెక్ పడింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    కర్నూలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు నాయుడు

    Chandra Babu: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. చెత్త పన్ను రద్దు  ఆంధ్రప్రదేశ్
    Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్
    Chandrababu: జనవరి నుంచి అమల్లోకి పీ4 విధానం.. 15శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యం భారతదేశం
    Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! ఎంపీ
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025