NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు
    తదుపరి వార్తా కథనం
    CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు
    'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు

    CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 19, 2025
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు.

    దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు 'బ్రాండ్ ఏపీ' పేరుతో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళుతున్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం తన ప్రయత్నాలను కేంద్రించనున్నారు.

    సీఎం తొలి రోజున జ్యూరిచ్‌లో 10 పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.

    అనంతరం హోటల్ హయత్‌లో 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పొరా' పేరుతో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని, ఏపీపై పెట్టుబడుల అవకాశాలు చర్చిస్తారు.

    Details

    అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం

    తర్వాత దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో మరో సమావేశం జరుగుతుంది.

    ఇందులో ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతారు.

    రెండో రోజు సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఇంపల్స్, వెల్‌స్పన్, కోకకోలా, ఎల్‌జీ, కార్ల్స్‌బర్గ్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, సిస్కో, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థల ఛైర్మన్లు, సీఈఓలతో సమావేశం జరుగుతుంది.

    ఈ సమావేశానికి యూఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ కూడా హాజరవుతారు. అనంతరం, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ చర్చల్లో కూడా సీఎం పాల్గొంటారు.

    మూడో రోజు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో మరోసారి సమావేశాలు జరుపుతారు. దావోస్‌లో రోజుకు కనీసం పదికి పైగా సమావేశాలు నిర్వహించి, నాలుగో రోజు ఉదయం స్వదేశానికి తిరిగి వస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    అమరావతి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానిస్తాం.. జలవనరులపై సమీక్షలో సీఎం భారతదేశం
    Chandrababu: పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి.. ఇళ్లు కట్టించి ఇస్తాం: చంద్రబాబు  భారతదేశం
    Nara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు నారా లోకేశ్
    Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత  నారా రోహిత్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025