NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన
    తదుపరి వార్తా కథనం
    నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన
    నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

    నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 14, 2023
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిమ్స్ ఆస్పత్రిని విస్తరించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుబంధ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

    అనంతరం ఈ ఆస్పత్రి కొత్త ప్రాంగణానికి దశాబ్ధి బ్లాక్‌గా నామకరణం చేశారు. ప్రస్తుత నిమ్స్ భవనం సరిపోవడం లేదనే నేపథ్యంలో మరో 2 వేల పడకలతో నూతన బ్లాక్‌ను కట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

    ఈ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చాక దేశంలోనే అత్యధిక బెడ్లతో నిర్మాణమైన అతిపెద్ద ఆస్పత్రుల జాబితాలో ప్రథమ స్థానం దక్కించుకోనుంది.

    2014 -2021 కాలంలో దాదాపు రూ. 90 కోట్ల విలువైన పరికరాలను నిమ్స్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 2022లో మరో రూ.153 కోట్ల పరికరాలను కొనేందుకు ఇప్పటికే ఆర్డర్ ఖరారైంది.

    DETAILS

    నిమ్స్ లో పెరిగిన రెసిడెంట్‌ డాక్టర్లు, టీచింగ్ స్టాఫ్ సంఖ్య

    నిమ్స్ కు 2014-15లో 185 కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం, 2022లో రూ. 242 కోట్ల మేర నిధులు అందించింది. అయితే ప్రస్తుత ఏడాది 2023లో కాస్త పెంచుతూ దాదాపు రూ.290 కోట్లు కేటాయించడం గమనార్హం.

    2014 నాటికి 900 బెడ్లతో ఉన్న నిమ్స్ ను కాలక్రమంలో 1489 సంఖ్యకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    తాజాగా కొత్త బ్లాక్ లో 2000 పడకల నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. 2014 నాటికి కేవలం 111 మంది టీచింగ్ స్టాప్ మాత్రమే ఉండగా, గతేడాది అదనంగా 150 మందిని నియమించారు.

    ఈ మేరకు బోధనా సిబ్బంది సంఖ్య 261కు చేరుకుంది. రెసిడెంట్‌ వైద్యుల సంఖ్యను సైతం పెంచడంతో ప్రస్తుతం 169 మంది కొనసాగుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    తెలంగాణ

    విద్యార్థులకు 1.17కోట్ల నోట్‌బుక్‌లను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం  తాజా వార్తలు
    హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... పలు రూట్లలో నో పర్మిషన్  భారతదేశం
    టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం  టీఎస్ఆర్టీసీ
    Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం  తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్

    ప్రభుత్వం

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం  ఆంధ్రప్రదేశ్
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: ప్రభుత్వ బడుల్లో వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌లు; విద్యార్థులకు ఇక 3డీలో పాఠాలు తెలంగాణ
    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్మూ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025