NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే?
    ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే?

    CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 10, 2025
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించడంలో తడబడుతున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఆయన అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలను కలిసి మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది.

    అధిష్టాన సూచనల మేరకే ఆయన ఢిల్లీకి వెళ్లారని భావిస్తున్నారు.

    సాధారణంగా మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే శాఖల కేటాయింపు గవర్నర్ గెజిట్ ద్వారా ప్రకటిస్తారు. కానీ ఈసారి ఆ ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది.

    దీనికి ముఖ్య కారణంగా కాంగ్రెస్ హైకమాండ్ శాఖల కేటాయింపుపై నేరుగా జోక్యం చేసుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    Details

    హోంశాఖను ఆశిస్తున్న కీలక నేతలు

    ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోం, మున్సిపల్, విద్య, సామాజిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనింగ్, కార్మిక, పశుసంవర్ధక, యువజన సేవలు, కమర్షియల్ టాక్స్, న్యాయ శాఖలున్నాయి.

    వీటిలో కొన్ని శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు సీఎం తన ప్రతిపాదనలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

    ఇక ఇప్పటికే మంత్రులుగా సేవలందిస్తున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ వంటి నేతలు హోంశాఖను ఆశించడంతో, కీలక శాఖల కేటాయింపుపై సవాళ్లను అధిష్టానం ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

    Details

    ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న హైకమాండ్

    మున్సిపల్ శాఖపై కూడా పలువురు మంత్రులు ఆసక్తిని వ్యక్తం చేశారట.

    ఈ శాఖల కేటాయింపులో పాత మంత్రుల అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు హైకమాండ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది.

    ఈ సమతుల్యతకు కృషి చేసేందుకు రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రుల శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం ఇవాళే? రేవంత్ రెడ్డి
    Biological smuggling: వుహాన్ ల్యాబ్‌తో సంబంధం ఉన్న చైనా శాస్త్రవేత్త అమెరికాలో అరెస్టు  అమెరికా
    Stock Market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@25,100 స్టాక్ మార్కెట్
    MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు ఎంఎస్ ధోని

    రేవంత్ రెడ్డి

    Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు! తెలంగాణ
    CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ నరేంద్ర మోదీ
    Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ
    Revanth Reddy: రక్షణ పరిశ్రమల అభివృద్ధికి హైదరాబాద్‌లో కారిడార్లు అవసరం: రేవంత్ రెడ్డి తెలంగాణ

    తెలంగాణ

    Gaddar Awards : ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్
    MSP: మార్కెట్ ధరలకంటే తక్కువగా మద్దతు ధరలు.. అన్నదాతలు ఆవేదన భారతదేశం
    Rajasingh: 'కవిత మాట్లాడింది నిజమే'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    Telangana Formation Day: జూన్ 2న తెలంగాణకు రాష్ట్ర హోదా లభించిన రోజు.. ఆ చరిత్రను ఓసారి గుర్తు చేసుకుందాం! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025